ETV Bharat / state

ఫూటుగా మందేసి రోడ్డు మీదకొచ్చాడు - గంటలో​ ఆరు ప్రమాదాలు చేశాడు - బ్రీత్​ఎనలైజర్​ రీడింగ్ చూస్తే! - Man Caused Six Accidents in Hyd

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 12:01 PM IST

Young Man Create Havoc with Car in Hyderabad
Young Man Create Havoc with Car in Hyderabad

Man Caused Six Road Accidents in Hyderabad : మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేసి ఒకరిని పొట్టన పెట్టుకోగా, మరో 11 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో జరిగింది.

Man Caused Six Road Accidents in Hyderabad : ఓ యువకుడు మద్యం తాగి అర్ధరాత్రి కారుతో బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్​లోని ఐకియా నుంచి ప్రారంభించి వరుసగా రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కామినేని ఆసుపత్రి వరకు ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు(Road Accidents in Hyderabad) చేశాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి. రోడ్డుపై దూసుకెళ్తూ రాత్రి 12.30 నుంచి 1.30 గంటల మధ్య ఈ వరుస ప్రమాదాలు చేశాడు. రాయదుర్గం ఠాణా పరిధిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : నగరంలోని నిజాంపేట ప్రగతినగర్​కు చెందిన పాతర్ల క్రాంతికుమార్​ యాదవ్​ ఆదివారం రాత్రి ఫుల్​గా మద్యం తాగాడు. ఆ మత్తులో కారులో బయలుదేరి ఐకియా రోటరీ వద్దకు చేరుకున్నాడు. తాగిన మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టగా ఆ కారు ధ్వంసమైంది. అందులోని ఒక మహిళకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఆ కారును ఢీకొట్టి అనంతరం అక్కడి నుంచి పారిపోతూ ఉండగా గచ్చిబౌలి బాబూఖాన్​ లేన్​ దగ్గర ఒక బైక్​ను ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో ఒకరికి కాలు విరిగిపోగా, ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఉప్పల్​లో రోడ్డు ప్రమాదం - మంటలు చెలరేగి కారు దగ్ధం - ఇద్దరు యువకులకు గాయాలు

పూటుగా మద్యం తాగి : నిందితుడు మరింత వేగంగా కారును నడుపుతూ పిస్తా హౌజ్​ ఎదురుగా వెళ్తూ 20-25 ఏళ్ల యువకుడిని ఢీకొట్టాడు. అక్కడి నుంచి పరారీ అయ్యాడు. వెంటనే ఆ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కానీ అతని వివరాలు ఏవీ బయటకు రాలేదు.

మత్తులోనే మరో మూడు ప్రమాదాలు : ఓ వ్యక్తి మరణించిన క్రాంతి తన వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఆ పారిపోతూ రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ సమీపంలోని కిమ్స్​ ఆసుపత్రి దగ్గర మరో బైక్​ను ఢీకొట్టి(Car and Bike Clash) వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా కారు ఆపకుండా అక్కడి నుంచి ఉడాయించాడు. ఇలా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ కిమ్స్​ ఆసుపత్రి సమీపంలోని ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

ఇలా గుద్దుకుంటూ పోతూ వరుస ప్రమాదాలు చేస్తున్న క్రాంతిని కొందరు గమనించి వెంటాడి మల్కం చెరువు దగ్గర వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. క్రాంతి పోలీసులు రాయదుర్గం పోలీస్​ స్టేషన్​కు తరలించి మద్యం పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో పోలీసులు అవాక్కు అయిపోయారు. ఏకంగా మీటరు రీడింగ్​ 550 వచ్చి ఆశ్చర్య పోయారు. నిందితుడి పూర్తి వివరాలను సేకరించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తును ప్రారంభించారు.

రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టిన కారు - అక్కడికక్కడే ఇద్దరు మృతి

రాష్ట్రంలో నెత్తురోడిన రహదారులు - వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.