ETV Bharat / state

రాష్ట్రంలో నెత్తురోడిన రహదారులు - వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 1:46 PM IST

Road Accidents in Telangana
Road Accidents in Telangana

Road Accidents in Telangana Today : రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Road Accidents in Telangana Today : తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రహదారులు రక్తమోడాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం మత్తు​ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి.

Road Accident in KPHB Colony : హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫోరంమాల్ సర్కిల్ వద్ద, ఓ కారు రాంగ్‌ రూట్‌లో వచ్చి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన వ్యక్తి అతి వేగంతో దూసుకొచ్చి, ఓ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Bus Accident In Muktsar : కాలువలో పడిన బస్సు.. 8 మంది మృతి.. అనేక మందికి గాయాలు

CAR Accident in KPHB Colony : ప్రమాదానికి కారణమైన వ్యక్తి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడి కుమారుడు అల్లోల అగ్రజ్‌ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో పార్టీ చేసుకున్న అగ్రజ్‌రెడ్డి, అతని స్నేహితులు మద్యం మత్తులో అతి వేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు. అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించి, మద్యం తీసుకున్నట్లు నిర్ధారించామని చెప్పారు. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Road Accident in Balanagar : బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఐడీపీఎల్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం (Road Accidents in Telangana) చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అతివేగంగా వెళ్లి, డీసీఎం వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో బైక్‌ నడుపుతున్న అఖిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, వెనక కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్ట నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ప్రమాదానికి కారణం అతివేగమేనని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

Khammam Accident Today : 'నేను రమ్మనకపోయినా బతికేటోళ్లు కొడుకా.. ఎంత పనైపాయే..'

Ibrahimpatnam Road Accident Today : రంగారెడ్డి జిల్లా ఇబ్రహ్రీంపట్నం శివారులో, ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పొయారు. గురునానక్‌ కళాశాల వద్ద కారును ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న శివకుమార్, రహీం అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, మృతులు యాచారం మండలం చింతపట్ల వాసులుగా గుర్తించారు. మృతదేహాలను (Ibrahimpatnam Road Accident) పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Road Accident in Suryapet District : మరోవైపు సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం (Road Accident in Suryapet) జరిగింది. జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి వద్ద అతివేగంతో వచ్చిన కారు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న శివ అనే వ్యక్తి రోడ్డుపై పడిపోగా, వెనకనుంచి వచ్చిన మరో కారు అతనిని ఢీ కొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొయాడు. మృతదేహాన్ని పోస్‌మార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

RTC Bus Accident in Yadadri District : ఆటోను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రమాదంలో ఇద్దరు మృతి

Adilabad Lorry Accident Viral Video : కంటైనర్​ బీభత్సం.. లారీ.. బైక్​.. ఆటో.. ఆగేదే లే అన్నట్లుగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.