ETV Bharat / state

ప్రతిపక్షాలకు కిషన్​ రెడ్డి సవాల్ - 'తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో అవినీతిని నిరూపించాలి'

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 10:23 PM IST

Kishan Reddy
Kishan Reddy

Kishan Reddy Participate in BJP Vijaya Sankalpa Yatra : బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ప్రతిపక్షాలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి సవాల్​ విసిరారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో అవినీతిని నిరూపించాలని అన్నారు. ఈ యాత్రలో భాగంగా తూఫ్రాన్​ నుంచి గజ్వేల్​ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Kishan Reddy Participate in BJP Vijaya Sankalpa Yatra : తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో అవినీతిని నిరూపించాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్రంలో ఉన్న ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర(BJP Vijaya Sankalpa Yatra) తూఫ్రాన్​ నుంచి గజ్వేల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రూ.12 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​లో ఉన్న కేంద్ర నాయకులతో పాటు రాష్ట్ర నాయకులు సైతం జైలుకి వెళ్లి వచ్చి బెయిల్​పై తిరుగుతున్నారని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నిక(Lok Sabha Election)ల్లో కమలం పువ్వుపై ఓటు వేసి మోదీని మూడోసారి గెలిపించాలని కోరారు. బీఆర్​ఎస్​కు ఓటు వేస్తే వృథా అవుతుందనీ పేర్కొన్నారు. 500 ఏళ్ల నుంచి ఏ పార్టీ చేయలేని ఘనమైన అయోధ్య రామ మందిరం నిర్మాణం మోదీ చేసి భారత జాతికి అండగా నిలిచారు అన్నారని హర్షం వ్యక్తం చేశారు.

విజయ సంకల్ప యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి : ఎంపీ లక్ష్మణ్‌

BJP Leader Raghunandan Rao Fire on BRS : బీజేపీని బద్నం చేయడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. బీఆర్​ఎస్​తో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం క్లియర్​గా చెప్పిందని పేర్కొన్నారు. గజ్వేల్​లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీజేపీ 10 స్థానాల్లోనూ, బీఆర్​ఎస్​ 7 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని కాంగ్రెస్​ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

బీఆర్​ఎస్​ను బీజేపీ(BJP)నే ఎదుర్కొంటుందని మూడుసార్లు తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. బీఆర్​ఎస్​ పార్టీ పని అయిపోయిందని పేర్కొన్నారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్​ ఇండియా కూటమిలో ఉన్నారు, కేజ్రీవాల్​ హైదరాబాద్​ వస్తే కేసీఆర్​ ఇంటికి వెళతారని వీళ్లిద్దరూ ఒక్కటేనని చెప్పుకొచ్చారు. దిల్లీలో లిక్కర్​ దుకాణం పెట్టి కొత్త దందా మొదలు పెట్టారని దిల్లీ డిప్యూటీ సీఎం జైల్లోనే ఉన్నారని ధ్వజమెత్తారు. అలాగే ఇక్కడ ఉన్న తెలంగాణ చెల్లె బతుకమ్మ పైసలు సరిపోతలేవని కొత్త దందాను మొదలుపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు బొమ్మ బొరుసు లాంటివి బీజేపీ కార్యకర్తలు ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మకండని రఘునందనరావు హితవు పలికారు.

బీజేపీకి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక పొత్తుల దుష్ప్రచారం చేస్తున్నారు : రఘునందన్‌ రావు

బీజేపీ నయా స్కెచ్- నోటిఫికేషన్​కు ముందే 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా- మోదీ, షా సైతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.