ETV Bharat / state

పిల్లలపై ఒత్తిడి తేకండి - స్ట్రెస్ తట్టుకోలేకే వారు డ్రగ్స్‌కు బానిసవుతున్నారు : సందీప్‌ శాండిల్య

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 2:27 PM IST

Updated : Mar 3, 2024, 6:05 PM IST

Drug Awareness Program in Hyderabad : దేశంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారిందని టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్ శాండిల్య అన్నారు. ఒంటరితనం అనుభవించేవారు ఎక్కువగా మాదకద్రవ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. సిటీ కమిషనరేట్​ నిర్వహించిన డ్రగ్స్ అవగాహన సదస్సులో విద్యార్థులకు, టీచర్లకు అవగాహన కల్పించారు.

Hyderabad Police Drug Awareness Program For Students
Police Conduct Awareness Program on Drugs

Drug Awareness Program in Hyderabad : తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చవద్దని, అలా చేయడం వల్ల వారు ఒత్తిడికి గురవుతున్నారని టీఎస్ న్యాబ్(TS NAB)​ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. ఆ ఒత్తిడితోనే చాలా మంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నట్లు తెలిపారు. అది క్రమంగా వారిని డ్రగ్స్​కు బానిసలుగా మారుస్తోందని చెప్పారు. డ్రగ్స్​ ఫ్రీ హైదరాబాద్ (Drugs Free Hyderabad)​ పేరుతో యాంటీ నార్కోటిక్స్​ ఫోరం, హైదరాబాద్​ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్​, హైదరాబాద్​ పోలీసులు నిర్వహించిన సదస్సులో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్​, సైబరాబాద్​, రాచకొండ కమిషనర్లు, టీఎస్​ న్యాబ్​ డైరెక్టర్​ సందీప్​ శాండిల్య, సిటీ సెక్యూరిటీ కౌన్సిల్​ ప్రతినిధులు, తల్లిదండ్రులు, పలు విద్యాసంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల కట్టడిపై సర్కార్ ఫోకస్ - రాష్ట్రంలో 'హుక్కా'ను నిషేధిస్తూ నిర్ణయం

Drugs Free Hyderabad : ఈ సందర్భంగా దేశంలో డ్రగ్స్ (Drugs)​ ప్రధాన సమస్యగా మారిందని టీఎస్​ న్యాబ్​ డైరెక్టర్​ సందీప్​ శాండిల్య అన్నారు. ఒంటరితనం అనుభవించే వారే ఎక్కువగా మాదక ద్రవ్యాలకు బానిసవుతున్నారని వివరించారు. ప్రస్తుతం దేశంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారిందని అన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలను పట్టించుకునేది ఎవరని ప్రశ్నించారు. సెల్​ఫోన్​కో లేదా ఒంటరిగా ఫీల్​ అయి డ్రగ్స్​ బారిన పడుతున్నారని అన్నారు. పోలీసులు చర్యలు తీసుకున్నా, తల్లిదండ్రులు వారి చిన్నారులను గమనించాలని సూచించారు.

విద్యార్థి క్లాస్​ రూం తప్పించుకున్నప్పుడే పక్కదారి పడతాడు : మరోవైపు ముఖ్య అతిథిగా పాల్గొన్న బుర్రా వెంకటేశం మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్​ బారిన పడకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే అవగాహన ముఖ్యమని అన్నారు. విద్యార్థి తన క్లాస్ రూమ్​ను తప్పించుకున్నప్పుడే పక్కదారి పడతాడని, బాల్యంలోనే పిల్లల భవిష్యత్ సక్రమంగా ఉంచాలని బుర్రా వెంకటేశం అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ విద్య, ఆరోగ్యం చాలా ముఖ్యమని తెలిపారు.

Drug Awareness For Students : మూడు కమిషనరేట్ల పరిధిలోని విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేశామని, ఎంతో మంది మేధావులను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించేది గురువులేనని హైదారాబాద్​ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అన్నారు. పాన్​ డబ్బాలో కూడా డ్రగ్స్​ దొరికేంత పరిస్థితి రావడం ఆందోళన కలిగిస్తుందని, సమాజంలో డ్రగ్స్​ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు.

డ్రగ్స్‌ కేసులో గోవా మూలాలు - స్నాప్‌చాట్‌లో చాటింగ్‌ - కొకైన్‌ డోర్‌ డెలివరీ

భాగ్యనగరంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న డ్రగ్స్​ మహమ్మారి - యువతను దాటి మైనర్ల వరకు!

Last Updated :Mar 3, 2024, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.