ETV Bharat / state

వజ్రకరూర్​లో వింత ఆచారం - అదేంటో తెలుసా? - vajrakarur donkey competitions

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 3:40 PM IST

Donkey_Running_Competitions_in_Vajrakarur
Donkey_Running_Competitions_in_Vajrakarur

Donkey Running Competitions in Vajrakarur: మనం ఇప్పటివరకూ కోడి, గుర్రం, ఎడ్ల పందేల గురించే విన్నాం. కానీ ఎప్పుడైనా గాడిదల పందేల గురించి విన్నారా?. వినడానికి ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ వింత ఆచారం అనంతపురం జిల్లా వజ్రకరూర్​లో నేటికీ కొనసాగుతోంది. మరి ఈ ఆచారం ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

వజ్రకరూర్​లో వింత ఆచారం - గాడిదలకు పరుగు పందెం

Donkey Running Competitions in Vajrakarur : సాధారణంగా రథోత్సవం అంటే దేవతా మూర్తులను రథంపై ఊరేగిస్తారు. కానీ అనంతపురం జిల్లా వజ్రకరూర్​లలో జరిగే రథోత్సంలో ఓ ప్రత్యేకత ఉంది. అది అందరిలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రథోత్సవంలో భాగంగా గాడిదల పరుగు పోటీలు : అనంతపురం జిల్లా వజ్రకరూర్​లో వెలసిన శ్రీ జనార్ధన వేంకటేశ్వర స్వామి రథోత్సవం ప్రతీ సంవత్సరం వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో ఓ ప్రత్యేకత ఉంది. గాడిదలకు పరుగు పోటీ నిర్వహిస్తారు. గాడిదలపై వాటి యజమానులు కూర్చొని, వాటిని పరిగెత్తిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ పోటీలో గుర్రాలకు తామేమీ తీసిపోమన్నట్టుగా గాడిదలు పరుగులు తీశాయి. ఈ పరుగు పోటీలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

దేవతల పెళ్లిలో పిడకల సమరం - ఏళ్లుగా కొనసాగుతున్న వింత ఆచారం - Pidakala Festival

ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహణ : ప్రతీ ఏటా జరిగే శ్రీ జనార్ధన వేంకటేశ్వర స్వామి రథోత్సవంలో రజక సంఘం ఆధ్వర్యంలో గాడిదలకు పరుగు పోటీలు నిర్వహిస్తారు. ఈ గాడిద పోటీలు క్రీడామైదానంలో కాకుండా రోడ్డు మీదనే నిర్వహిస్తారని స్థానికులు తెలిపారు. వజ్రకరూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం గాడిదల మీద వెళ్లి తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్ల దూరం ఈ రన్నింగ్ పోటీ నిర్వహించారు. పోటీలో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు అందజేసి, శాలువా కప్పి సత్కరించారు.

'తలారి చెరువు'లో అగ్గిపాడు ఆచారం- ఆ రోజు ఊరంతా ఖాళీ 'అర్ధరాత్రి దాటాక !'

భారీగా తరలివస్తున్న జనం : ఆద్యంతం ఆసక్తికరంగా, పోటాపోటీగా సాగిన ఈ గాడిదల పరుగు పందెంలో చివరకు మూడు గాడిదలు మాత్రమే మిగిలాయి. ఈ వినోదాన్ని యువకులు బైకులపై ప్రయాణిస్తూ తిలకిస్తూ, వీడియోలు చిత్రీకరించారు. ఈ గాడిద పందేలు ఫేమస్​ అవ్వటంతో చుట్టుపక్కల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

Scorpions Festival at Kurnool District: కర్నూలు జిల్లాలో వింత ఆచారం.. కొండరాయుడికి తేళ్లతో పూజలు

ఈ కార్యక్రమం అనంతరం రథం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తెల్లవారుజామున స్వామివారి మూల విరాట్​కు అభిషేకం, అలంకరణ, అర్చనలు, పూజలు చేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి క్షేత్రం ఆవరణంలో భాజాభజంత్రీల నడుమ ఊరేగించారు. సాయంత్రం రథంపై ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి రథాన్ని లాగారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.