ETV Bharat / state

రాష్ట్రంలో 39.50 లక్షల మందికి రూ.500కే గ్యాస్‌ - మొదటి విడతలో వీరికే ఛాన్స్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 12:14 PM IST

Congress Government on Gas Cylinder Scheme
Congress Government on Gas Cylinder Scheme

Congress Govt on Gas Cylinder Scheme : తెలంగాణలో రూ.500కే గ్యాస్​ సిలిండర్ పథకం అమలుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో పౌర సరఫరాల శాఖ డీలర్లతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అర్హులైన వినియోగదారులకు రూ.500కే సిలిండర్‌ ఇవ్వాలని, మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందని పౌర సరఫరాల శాఖ డీలర్లకు స్పష్టం చేసింది.

Congress Govt on Gas Cylinder Scheme : రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీ అమలుపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని గ్యాస్‌ డీలర్లు రూ.500కే సిలిండర్‌ పథకం అమలుకు సిద్ధం కావాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. గురువారం జరిగిన కేబినేట్ సబ్‌ కమిటీ భేటీలో ఈ పథకంపై గ్యాస్‌ డీలర్లతో చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.

Officers on 500 Rupees Gas Cylinder Scheme : దీంతో వెంటనే పౌర సరఫరాల శాఖ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్‌ ప్రతినిధులతో సివిల్‌ సప్లయ్స్‌ భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీగా రాష్ట్ర సర్కార్ డీలర్లకు చెల్లించే మొత్తానికి జాతీయ బ్యాంకు అగ్రిగేటర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది.

గ్యాస్​ సిలిండర్​ ఎక్స్​పైరీ డేట్ ఎలా చెక్ చేయాలో తెలుసా?

తెలంగాణలో 1.20 కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో రేషన్‌కార్డు ఉన్నవారి సంఖ్య 89.99 లక్షలు. ప్రాథమిక అంచనా మేరకు ప్రస్తుతం 39.50 లక్షల మందిని సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ పథకానికి ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి సిలిండర్‌ కనెక్షన్‌ పాస్‌బుక్‌, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును పరిశీలించి ఆ వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉండనుంది.

Mahalakshmi Gas Cylinder Scheme in Telangana : పథకం అమల్లోకి వచ్చిన రోజు నుంచి అర్హులైన వినియోగదారులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ (500 Rupees Gas Cylinder Scheme ) ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ డీలర్లకు స్పష్టం చేసింది. మిగిలిన మొత్తాన్ని తెలంగాణ సర్కార్ చెల్లిస్తుందని వివరించగా డీలర్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. డీలర్ల సంఘం ప్రతినిధులు తమ సందేహాలను వ్యక్తంచేయడంతో పాటు కొన్ని సలహాలు ఇచ్చారు.

How to Book Gas Cylinder Using Gpay : గూగుల్ పే ఉపయోగించి గ్యాస్ సిలిండర్​ బుక్​ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

డీలర్లకు అడ్వాన్సు చెల్లించే ప్రతిపాదన : డీలర్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తామని పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department ) ప్రతిపాదించింది. సిలిండర్ల పంపిణీ ఆధారంగా మిగతా మొత్తం చెల్లిస్తామని పేర్కొంది. డీలర్ల సంఘం నుంచి అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి, ట్రెజరర్‌ ఐలారెడ్డి, కార్యదర్శి శ్రీచరణ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌తో పాటు పదాధికారులు పాల్గొన్నారు. ఓ జాతీయ బ్యాంకు ఉన్నతాధికారి కూడా సమావేశానికి హాజరయ్యారు.

మరోవైపు ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.955గా ఉంది. ఒక్కో సాధారణ కనెక్షన్లపై బుకింగ్‌కు కేంద్రం రూ.40 రాయితీ ఇస్తోంది. అదే ఉజ్వల్‌ కనెక్షన్లకైతే రాయితీగా రూ.340 అందిస్తోంది. తెలంగాణలో ఉజ్వల్‌వి 11.58 లక్షలు ఉన్నాయి. గివ్‌ ఇట్‌ అప్‌లో భాగంగా రాష్ట్రంలోని 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు.

రూ.500కే గ్యాస్​ సిలిండర్ - మూడేళ్ల సగటు లెక్క ప్రకారమే కసరత్తు!

కమర్షియల్​ ఎల్​పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్​న్యూస్​​- ​సిలిండర్​పై రూ.39.50 తగ్గింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.