ETV Bharat / state

గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలు ఈనెల 27 లేదా 29న ప్రారంభం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 12:57 PM IST

Updated : Feb 22, 2024, 7:13 PM IST

CM Revanth Reddy Meeting with Cabinet Sub-Committee : గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను ఈనెల 27 లేదా 29న ప్రారంభించనున్నారు. ఈమేరకు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్​ సబ్​ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి మొదటి వారం నుంచి అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే కొందరు అధికారులు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

CM Revanth Clarifies on Two Guarantees
CM Revanth Reddy Meeting with Cabinet Sub-Committee

గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలు ఈనెల 27 లేదా 29న ప్రారంభం

CM Revanth Reddy Meeting with Cabinet Sub-Committee : రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీల అమలుకు ముందడుగు పడింది. గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను ఈనెల 27 లేదా 29న ప్రారంభించనున్నట్లు, సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్​ సబ్​ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Clarifies on Two Guarantees : ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గ్యాస్ సిలిండరుపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా? ఏజెన్సీలకు చెల్లించాలా? అనే అంశంపై పౌరసరఫరాలు, ఆర్థిక శాఖల అధికారులతో సీఎం చర్చించారు. ఎలా చేసినప్పటికీ లబ్ధిదారుడు 500 రూపాయలు చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేలా ప్రజలకు అనువైన విధానాన్ని రూపొందించాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. సబ్సిడీ నిధులను గ్యాస్ ఏజెన్సీలకు వెంట వెంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

Gruhajyothi Scheme Implementation : అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే గృహజ్యోతి పథకాన్ని ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డున్న 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే నెలలో అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం(Gruhajyothi Scheme) కింద జీరో బిల్లులే జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఉచిత కరెంటుతో గ్రిడ్​పై ఎంత భారమెంత - అధ్యయనానికి కర్ణాటకకు అధికారులు

ప్రజా పాలనలో సమర్పించిన దరఖాస్తుల్లో రేషన్ కార్డు, విద్యుత్ కనెక్షన్ నంబరు తప్పు ఉన్నట్లయితే సవరించుకునే అవకాశమివ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజా పాలనలో(Praja palana) దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, పౌరసరఫాల కమిషనర్ డీఎస్ చౌహన్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CM Revanth Review on Mission Bhagiratha : మరోవైపు పురపాలక, ఆర్​డబ్యూఎస్(RWS)​ విభాగాలతోనూ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై అధికారులతో సీఎం చర్చించారు. వేసవికాలం దృష్ట్యా మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రామాలలో ప్రత్యేకాధికారులు నీటిసరఫరాకు ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించాలని తెలిపారు.

రూ.500కే గ్యాస్​ సిలిండర్ - మూడేళ్ల సగటు లెక్క ప్రకారమే కసరత్తు!

ఇంకా యుద్ధం ముగియలేదు - ఇది విరామం మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

Last Updated :Feb 22, 2024, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.