ETV Bharat / state

ఏపీ ఇంటర్​ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా - ap Inter Results 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 11:31 AM IST

Updated : Apr 12, 2024, 2:03 PM IST

AP ​Inter Exam Results Released 2024
AP ​Inter Exam Results Released 2024

AP ​Inter Exam Results Released 2024 : ఏపీలో విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్​ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇంటర్​ బోర్డు విడుదల చేసింది.

AP ​Inter Exam Results Released 2024 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు ( AP Intermediate Results 2024) విడుదలయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరంలో 78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ సౌరబ్‌గౌర్‌, పరీక్షల కంట్రోలర్‌ సుబ్బారావు ప్రకటించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించినట్లు వెల్లడించారు. మొదటి సంవత్సర ఫలితాల్లో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు.

AP Intermediate Results : ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత పొందారని సౌరబ్‌గౌర్ చెప్పారు. మొదటి సంవత్సర ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమస్థానం, 81 శాతంతో గుంటూరు జిల్లా ద్వితీయస్థానం, 79 శాతంతో ఎన్టీఆర్‌ జిల్లా తృతీయస్థానం, 48 శాతంతో అల్లూరి జిల్లాకు ఆఖరిస్థానం వచ్చిందన్నారు. రెండో సంవత్సర ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమస్థానం, 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు ద్వితీయస్థానం, 84 శాతంతో విశాఖ జిల్లాకు తృతీయస్థానం, 63 శాతంతో చిత్తూరు జిల్లాకు ఆఖరిస్థానంలో ఉందని తెలిపారు.

గురుకుల జేఎల్​ పరీక్ష ఫలితాలు విడుదల

ఈనెల 18 నుంచి 24 వరకు రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సౌరబ్‌గౌర్ తెలిపారు. ఫెయిల్ అయినా, మరింతగా మెరుగైన మార్కులు సాధించాలనుకునే విద్యార్థుల కోసం సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రాక్టికల్‌ పరీక్షల సప్లిమెంటరీ మే 1 నుంచి 4 వరకు నిర్వహిస్తామన్నారు.

తెలంగాణ గురుకుల ఉద్యోగ ఫలితాలు వెల్లడి - 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా విడుదల

పరీక్షల కోసం ఫీజులను ఈనెల 18 నుంచి 24లోగా సంబంధిత కళాశాల వద్ద చెల్లించాలని పేర్కొన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఫలితాల వల్ల భవిష్యత్ ప్రభావితం కాదని చెప్పారు. ఫలితాలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు తమ పిల్లలకు మద్దతుగా ఉండాలని సౌరబ్‌గౌర్ విజ్ఞప్తి చేశారు.

ఈ ఏడాది రెగ్యులర్​, ఒకేషనల్​ విద్యార్థులు కలిపి మొదటి, రెండవ సంవత్సరానికి గాను మార్చి 1వ నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,559 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 10,02,150 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్​ పరీక్షల ఫలితాలను www.bie.ap.gov.in అధికార వైబ్​సైట్​ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫస్ట్ ఇయర్ వొకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Last Updated :Apr 12, 2024, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.