ETV Bharat / politics

మోదీని కలిసిన పీవీ నరసింహారావు ఫ్యామిలీ - నేడు రెండు సభల్లో ప్రధాని ప్రచారం - PV NARASIMHA RAO FAMILY MEETS MODI

author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 7:07 AM IST

PM Narendra Modi Meets PV Family : లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ ప్రచారంలో జోరు పెంచింది. తమ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేసేందుకు వచ్చిన ప్రధాని మోదీని హైదరాబాద్​లో మాజీ ప్రధాని నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. ఈ విషయాన్ని తన ఎక్స్​ ఖాతాలో పోస్ట్​ చేశారు. నేడు ఆయన కరీంనగర్, వరంగల్​లలో జరిగే సభల్లో పాల్గొననున్నారు.

PM Modi Election Campaign
PM Narendra Modi Meet PV Family (ETV Bharat)

PV Narasimha Rao Family Meets PM Modi in Hyderabad : ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపినట్లు బీజేపీ నాయకులు ఎస్​వీ. సుభాశ్​ తెలిపారు. పీవీ కుటుంబ సభ్యులతో భేటీ అయిన చిత్రాన్ని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్​లో పోస్టు చేశారు.

PM Modi Latest Tweet : భారతీయ సంస్కృతి, సంప్రదాయలు తదతర అంశాలపై వారితో చర్చించినట్లు మోదీ తెలిపారు. ఇటీవల కాలంలో మన దేశం సాధిస్తున్న పురోగతిపై పీవీ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పీవీ నరసింహారావుకు ఇటీవలే భారత ప్రభుత్నం భారతరత్న అవార్డును ప్రకటించింది. మార్చి 30 2024న పీవీ తరుఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

"హైదరాబాద్ చేరుకున్నాక మన మాజీ ప్రధాని, పండితుడు, రాజకీయ దురంధరుడు, శ్రీ పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో సమావేశం అద్భుతంగా జరిగింది. శ్రీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించినందుకు గాను వారు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మా సమావేశంలో అనేక విషయాలను విస్తృతంగా చర్చించుకున్నాం. ఇటీవలి కాలంలో భారతదేశం సాధించిన ప్రగతి పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ సంస్కృతీ , సంప్రదాయాల ఔన్నత్యం గురించి కూడా మేము మాట్లాడుకున్నాం." అంటూ మోదీ తన ఎక్స్​ ఖాతాలో పోస్ట్​ చేశారు.

విపక్షాలకు పాకిస్థాన్​పై ఎందుకా ప్రేమ? భారత సైన్యంపై ద్వేషమెందుకు?: మోదీ - lok sabha elections 2024

PM MODI Telangana Tour Schedule : నేడు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వేములవాడ, వరంగల్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. లోక్​సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్న మోదీ రాత్రి రాజ్​భవన్‌లో బస చేశారు. ఎనిమిదిన్నర సమయానికి బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకుంటారని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వెల్లడించారు. కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా ప్రచార సభలో మోదీ పాల్గొంటారని తెలిపారు. అనంతరం వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్ధి అరూరి రమేశ్ గెలుపు కోరుతూ ప్రధాని మోదీ వరంగల్‌లో జరిగే సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ఏపీకి వెళ్లనున్నారు.

'కాంగ్రెస్​ వస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం- అందుకే NDAకు 400 సీట్లు అవసరం' - lok sabha election 2024

'హింస లేకుండా రెండు విడతల ఎన్నికలు'- ఈసీపై మోదీ ప్రశంసలు- ప్రధానికి రాఖీ కట్టిన బామ్మ - lok sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.