ETV Bharat / politics

మిషన్ భగీరథపై లాభనష్టాలు బేరీజు వేసుకోవడం ప్రభుత్వానికి తగదు : హరీశ్​ రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 8:23 PM IST

Harish Rao Comments on Revanth Reddy about Mission Bhagiratha
మిషన్ భగీరథపై లాభనష్టాలు బేరీజు వేసుకోవడం ప్రభుత్వానికి తగదు : హరీశ్​ రావు

Harish Rao Comments on Revanth Reddy about Mission Bhagiratha : ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించే మిషన్ భగీరథలో కూడా లాభం వెతికే వ్యక్తి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని హరీశ్​ రావు వ్యాఖ్యానించారు. తాగునీరుపై లాభనష్టాలను వేసుకునే ప్రభుత్వం వస్తుందని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించకపోవచ్చని ఆయన అన్నారు.

Harish Rao Comments on Revanth Reddy about Mission Bhagiratha : సాగునీరు, తాగునీరు ఇవ్వడానికి కూడా లాభనష్టాలతో బేరీజు వేసుకునే ప్రభుత్వం వస్తుందని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించి ఉండరని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు ఆక్షేపించారు. ప్రభుత్వమంటే స్థిరాస్తి వ్యాపారం కాదన్న ఆయన, ప్రజా సంక్షేమంలో లాభనష్టాలు చూసుకోరని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారని అన్నారు. మిషన్ భగీరథ(Mission Bhagiratha)లో లాభం వెతికే ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమన్న హరీశ్​ రావు, ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదని, అందువల్ల దండగ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత శోచనీయమని ఆయన మండిపడ్డారు.

మిషన్ భగీరథ ద్వారా ఏం లాభం తెచ్చారని, దానికి తెచ్చిన అప్పుకు వడ్డీ ఎలా కడతారని ప్రశ్నించడం కంటే దౌర్భాగ్య, భావ దారిద్య్ర ఆరోపణ ఇంకోటి ఉండదని హరీశ్​ రావు(Harish Rao) అన్నారు. అసలు మిషన్ భగీరథ ఎందుకు తేవాల్సి వచ్చింది? దాని లక్ష్యం ఏమిటన్న విషయాలపై కనీస అవగాహన కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం నల్లాల ద్వారా మంచినీరు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిందన్న హరీశ్​ రావు, మిషన్ భగీరథ పథకాన్ని ప్రజల ఆరోగ్యం కాపాడిన గొప్ప సంజీవనిగా చూడాలి తప్ప, అందులో లాభనష్టాలు బేరీజు వేసుకోవడం ప్రభుత్వాధినేతకు తగదని సలహా ఇచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టారు కానీ, ఫలితం లేదన్న విమర్శలపై అసెంబ్లీలో సాక్ష్యాలు, ఆధారాలతో స్పష్టంగా వివరించినప్పటికీ విమర్శలు చేయడం తగదని హరీశ్​ రావు ఆక్షేపించారు. 2014తో పోలిస్తే 2023 చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో పెరిగిన ఆయకట్టును లెక్కలతో సహా చెబితే అది చెవికెక్కదన్న ఆయన, ఎస్సారెస్పీ ద్వారా కోదాడ, డోర్నకల్ వరకు నీరు ఇచ్చామంటే కాళేశ్వరం వల్లే అన్న విషయం అర్థం కాదని మండిపడ్డారు. 1956 నుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు మొత్తంగా 41 లక్షల కొత్త ఆయకట్టుకు మాత్రమే నీరు అందిస్తే, గడిచిన తొమ్మిదిన్నరేళ్లలోనే బీఆర్​ఎస్​ ప్రభుత్వం 48 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందని లెక్కలు, ఆధారాలతో సహా చెప్పినా వీరికి అవగాహన కలగడం లేదని అన్నారు.

Harish Rao Comments On Congress Government : బీడుబడ్డ భూముల్లో సిరులు పండుతుంటే రైతులు పడే సంతోషం చూడాలి తప్ప స్థిరాస్తి వ్యాపారి మనస్తత్వంతో లాభ నష్టాలు చూడవద్దని మాజీ మంత్రి హరీశ్​రావు కోరారు. తాగునీటి కోసం పడిన అక్కాచెల్లెళ్ల కష్టాలను లాభ నష్టాలతో లెక్కగడతామా? అని అన్నారు. వేల కోట్లు ఖర్చయ్యే ఆసరా పింఛన్ల ద్వారా లాభం లేదంటారా, లాభం లేదని రైతుబంధు పథకాన్ని రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రత్యక్ష లాభం కనిపించని ఆరోగ్యశ్రీ(Aarogyasri), ఫీజు రీయింబర్స్​మెంట్, రూపాయికి కిలో బియ్యం లాంటి పథకాలను రద్దు చేస్తారా? అని హరీశ్​ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం పరిమితికి లోబడే అప్పులు చేసిందని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ(RBI) చాలాసార్లు స్పష్టం చేశాయన్న ఆయన, తెలంగాణ అప్పు 23.8 శాతమే అన్న విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? అని వ్యాఖ్యానించారు.

అప్పులను తప్పుపడుతున్న సీఎం 2024-25 బడ్జెట్​లో లోటును అప్పుల ద్వారా సమకూర్చుకుంటామని ఎందుకు చెప్పారని రేవంత్​రెడ్డిని ఉదేశిస్తూ మాజీ మంత్రి హరీశ్​ రావు ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకమందే వేల కోట్ల అప్పులు ఎందుకు తెచ్చారని అన్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్న మాజీ మంత్రి, ఇచ్చిన హామీలే వారికి ఉరితాళ్లుగా మారబోతున్నాయని, ముందు ఆ హామీల గురించి మాట్లాడమని సూచించారు. ప్రతిసారి తన ఎత్తు గురించి వ్యాఖ్యానించే రేవంత్ రెడ్డి(CM Revanth) ఎత్తు గురించి తాను మాట్లాడితే సంస్కారవంతంగా ఉండదని హరీశ్​ రావు వ్యాఖ్యానించారు. ఎవరు ఎంత ఎత్తు ఉన్నారనేది ప్రజలకు అవసరం లేదన్న ఆయన, ప్రజల కోసం ఎవరెంత ఆలోచిస్తున్నారో, ఎంత పని చేస్తున్నారో మాత్రమే అవసరమని పేర్కొన్నారు.

కాళేశ్వరంపై సీఎం కుట్ర చేస్తున్నారు - మార్చి 1 నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ : కేటీఆర్

బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలెేపుతున్నారు - బీజేపీ హైకమాండ్ ఆలోచించాలి : మంత్రి పొన్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.