Bandla Ganesh Comments on KTR : కేటీఆర్ తన తండ్రి పేరు అడ్డుపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారే తప్ప అయనకు ఎలాంటి గుర్తింపులేదని కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పోరాట యోధుడని, బీఆర్ఎస్(BRS) పెట్టిన చిత్రహింసలు మానసిక క్షోభనధిగమించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారని కితాబిచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కేటీఆర్ బాధపడుతున్నారని, ఆయన రాజకీయపరంగా డిజాస్టర్ అన్నారు. కేటీఆర్ను సీఎంగా ప్రకటిస్తే ఆ పార్టీకి మూడు సీట్లు కూడా రాకపోయేవని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ నేతలు వందల యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి సీఎం రేవంత్ను(CM Revanth) తిట్టిస్తున్నారని బండ్ల గణేశ్ ఆరోపించారు. కేటీఆర్ కాల్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సైతం పారిపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు స్వేచ్ఛ అనే 7వ గ్యారెంటీ కూడా ఇచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఎన్కౌంటర్ చేయించే వాళ్లని, రాళ్లతో కొట్టి చంపించే వాళ్లని అన్నారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్లారని, ఆయన హయాంలో పని చేసిన ఆఫీసర్ల దగ్గర కోట్లాది రూపాయల నల్లధనం ఉందని ఆరోపించారు.
Bandla Ganesh Comments on Roja : ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డిపై ఏపీ మంత్రి రోజా చేసిన విమర్శలను తిప్పికొడుతూ, ఆమె డైమండ్ రాణి అని బండ్ల గణేశ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ ఫైటర్ అని, ఆయన యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి కాలేదని, ఏపీ సీఎం జగన్(CM Jagan) అయ్యారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ నాయకుల ఏం చేస్తారని ప్రశ్నించారు. మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా అని ఎద్దేవా చేశారు. ఆ ప్రాజెక్టు కూలిపోతే తమదే బాధ్యత అని బీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న మూడు పిల్లర్లు ముప్పై పిల్లర్లు కాకుండా ప్రభుత్వం కాపాడుతోందని అన్నారు.
'కేటీఆర్ మీరు రాజకీయంగా డిజాస్టర్ అయ్యారు. మొన్న అసెంబ్లీలో కూడా మీరు సైలెంట్గా కూర్చుంటే హరీశ్రావు మాట్లాడారు. మా వాళ్లు సమాధానాలు చెప్పారు. మీరు అమెరికాలో ఇల్లు కొనుకోవడానికి వెళ్లి వచ్చారు. మంచిగా సెటిల్ అవ్వండి. మీరు చేసిన తప్పులన్నింటికీ జవాబులు చెప్పాలి. ఒకవేళ తప్పులు చేస్తే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. మీ హయాంలో పని చేసిన అధికారులే తప్పులన్నింటికీ మీ పేరు చెబుతున్నారు.'- బండ్ల గణేష్, కాంగ్రెస్ నేత
పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు - ప్రజాహిత యాత్రలో టెన్షన్, టెన్షన్
కాళేశ్వరంపై సీఎం కుట్ర చేస్తున్నారు - మార్చి 1 నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ : కేటీఆర్