ETV Bharat / business

పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు - జోక్యం చేసుకోలేమన్న కేంద్రం - కానీ లాభాల్లోకి షేర్లు!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 12:19 PM IST

Paytm shares today
Paytm shares climb for 2nd day

Paytm Shares Climb : పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన ఆంక్షల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే స్టాక్​ మార్కెట్లో మాత్రం పేటీఎం షేర్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో దూసుకెళ్తుండడం గమనార్హం.

Paytm Shares Climb : పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్​పై (PPBL) ఆర్‌బీఐ విధించిన ఆంక్షల వ్యవహారంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోమని కేంద్రం స్పష్టం చేసింది. మంగళవారం పేటీఎం సీఈవో విజయ్​ శేఖర్​ శర్మ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​తో భేటీ అయ్యారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆమె స్పష్టం చేసిందని విశ్వసనీయ సమాచారం.

కేవలం 10 నిమిషాలే
పేటీఎం సీఈవో విజయ్​ శేఖర్​ శర్మ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ల మధ్య జరిగిన భేటీ కేవలం 10 నిమిషాల్లో ముగిసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పేటీఎంపై ఆర్​బీఐ విధించిన ఆంక్షల ఈ వ్యవహారంలో కేంద్రం ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదని ఆర్థికమంత్రి చెప్పినట్లు సమాచారం. అంతేకాదు నేరుగా ఆర్‌బీఐతోనే చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఆర్​బీఐతోనూ చర్చలు
విజయ్​ శేఖర్ శర్మ తమ సంస్థపై విధించిన రెగ్యులేటరీ ఆంక్షలపై చర్చించేందుకు ఆర్‌బీఐ అధికారులతోనూ సమావేశమైనట్లు సమాచారం తెలుస్తోంది.

లాభాల్లోకి షేర్లు
Paytm Shares Today : పేటీఎం ఫిబ్రవరి 29 తర్వాత ఖాతాదారులు నుంచి డిపాజిట్లు స్వీకరించకూడదని ఆర్​బీఐ స్పష్టం చేసింది. అలాగే కస్టమర్లు ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, వ్యాలెట్‌, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు చేయకూడదని స్పష్టం చేసింది. పేటీఎం బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించడం వల్లే ఈ ఆదేశాలు జారీ చేశామని ఆర్‌బీఐ పేర్కొంది.

పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, అందుకు సంబంధించిన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆర్‌బీఐను ఈడీ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లు కోరాయి. ఈ పరిణామాలతో ఇటీవల పేటీఎం కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. కానీ తరువాత పేటీఎం షేర్లు మరలా పుంజుకుని, వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి.

బుధవారం పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యునికేషన్ షేర్లు బీఎస్​ఈలో 9.99 శాతం లాభపడ్డాయి. దీనితో ఈ షేర్ వాల్యూ రూ.496.75 వద్ద లాభాలతో ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈలో కూడా పేటీఎం స్టాక్స్​ 9.99 శాతం లాభపడి రూ.496.25 వద్ద కొనసాగుతున్నాయి.

యూపీఐ సేవలు డౌన్- ఆ బ్యాంకుల్లో సమస్యల వల్లే! NPCI ఏమందంటే?

షేర్​​ మార్కెట్లో భారీ లాభాలు సంపాదించాలా? బెస్ట్ పోర్ట్​ఫోలియోను నిర్మించుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.