ETV Bharat / bharat

గూడ్స్​ రైలును ఢీకొన్న సబర్మతి ఎక్స్​ప్రెస్​- పట్టాలు తప్పిన ఇంజిన్ సహా 4 బోగీలు

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 8:15 AM IST

Updated : Mar 18, 2024, 1:38 PM IST

Train Accident In Rajasthan :
Train Accident In Rajasthan :

Train Accident In Rajasthan : రాజస్థాన్​ అజ్​మేర్​లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మదార్​ స్టేషన్​ సమీపంలో ఉన్న గూడ్స్​ రైలును సబర్మతి ఎక్స్​ప్రెస్​ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఫలితంగా సబర్మతి ఎక్స్​ప్రెస్​ ఇంజిన్​ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి.

Train Accident In Rajasthan : రాజస్థాన్​ అజ్​మేర్​లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మదార్​ స్టేషన్​ సమీపంలో ఉన్న గూడ్స్​ రైలును సబర్మతి ఎక్స్​ప్రెస్​ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఫలితంగా సబర్మతి ఎక్స్​ప్రెస్​ ఇంజిన్​ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది.

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్ చీఫ్ శశి కిరణ్ తెలిపారు. ఈ ఘటన కారణంగా ఆరు రైళ్లు రద్దు చేశామని, మరో రెండు రైళ్లను వేరే మార్గాల ద్వారా మళ్లించామని కిరణ్ పేర్కొన్నారు. అజ్​మేర్ రైల్వే స్టేషన్​ హెల్ప్​డెస్క్​లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సమాచారం కోసం 0145-2429642 హెల్ప్​లైన్ నంబర్​ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పారు.

సబర్మతి రైలులో ప్రయాణిస్తున్న వారిని అజ్​మేర్ రైల్వే స్టేషన్​కు తరలించినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపిస్తామని చెప్పారు. ఘటనాస్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు అజ్​మేర్ రైల్వే డిఆర్​ఎమ్ రాజీవ్ ధన్​కర్ చెప్పారు.

రద్దు చేసిన రైళ్లు
12065 అజ్​మేర్​- దిల్లీ-సరాయ్ రోహిల్లా, 22987 అజ్​మేర్​- ఆగ్రా ఫోర్ట్, 09605 అజ్​మేర్​-గంగాపూర్ సిటీ, 09639 అజ్​మేర్-రేవాడ్, 19735 జైపుర్ - మార్వార్ రైల్వే శాఖ రద్దు చేసింది. 12915 సబర్మతి - దిల్లీ రైలు, 17020 హైదరాబాద్-హిసార్ రైలు వేరే మార్గాల ద్వారా మళ్లించారు.

రైలు బోగీలో సిలిండర్లు బ్లాస్ట్
Fire In Train Compartment In Haryana : ఇటీవలే రైలు బోగీలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి మూడు సిలిండర్లు పేలాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన హరియాణాలోని అంబాలా సిటీ రైల్వే స్టేషన్​లో జరిగింది. బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు రావడం వల్ల స్థానికంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం- ఇద్దరు మృతి- శిథిలాల కింద అనేక మంది!

పెళ్లికి వెళ్లి వస్తున్న కారు, ట్రాక్టర్​ ఢీ- ముగ్గురు చిన్నారుల సహా ఏడుగురు మృతి

Last Updated :Mar 18, 2024, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.