తెలంగాణ

telangana

తాళి కట్టిన చేతితోనే తాడు బిగించి ఉరి.. ఆపై భర్త ఆత్మహత్య

By

Published : May 26, 2021, 2:07 PM IST

మంచాన పడిన ఆ భార్యకు భర్తే అన్నీ తానైయ్యాడు. పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆమె ఆలనాపాలనా చూసుకున్నాడు. కానీ ఓ రోడ్డు ప్రమాదం వారి జీవితాన్ని తలకిందులు చేసింది. చేసేది లేక తాళి కట్టిన ఆ చేతితోనే మెడకు ఉరితాడు బిగించాడు ఆ భర్త. అనంతరం తానూ ఉసురు తీసుకున్నాడు.

old couple suicide at chinnamallareddy village, couple suicide
వృద్ద దంపతులు ఆత్మహత్య, కామారెడ్డిలో దంపతుల ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాళి కట్టిన చేతితోనే భార్యకు ఉరి తాడు బిగించాడు ఓ భర్త. అనంతరం తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్షవాతంతో బాధపడుతున్న భార్యకు సపర్యలు చేసే ఆ భర్త... తనకు రోడ్డు ప్రమాదం జరిగి ఆమెను సరిగా చూసుకోలేకపోతున్నానని మనస్తాపం చెంది ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చిన్నమల్లారెడ్డికి చెందిన సిద్దయ్య (65), బాలమణి(56) దంపతులు పిల్లల పెళ్లిళ్లు చేసి ఇద్దరే ఉంటున్నారు.

పక్షవాతం వచ్చి మంచం పట్టిన బాలమణికి సిద్దయ్య అన్నీ తానై సపర్యలు చేస్తుండేవారని బంధువులు వెల్లడించారు. ఆ తర్వాత తనకు రోడ్డు ప్రమాదం జరగడంతో భార్యను సరిగా చూసుకోలేకపోతున్నానని మనస్తాపం చెందినట్లు తెలిపారు. చివరకు భార్యను కిటికీ ఊచలకు ఉరి వేసి... అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

ఇదీ చదవండి:juda strike: సమ్మెకు దిగిన జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు

ABOUT THE AUTHOR

...view details