తెలంగాణ

telangana

అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులివ్వండి: మేయర్​

By

Published : Jun 9, 2021, 1:29 PM IST

నాలాలకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు ఇవ్వాలని అధికారులను జీహెచ్​ఎంసీ మేయర్​ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. హైదరాబాద్​ హిమాయత్​నగర్​లో స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మీ​ రామన్​గౌడ్​తో కలిసి పర్యటించారు.

అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులివ్వండి: మేయర్​
అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులివ్వండి: మేయర్​

హైదరాబాద్ హిమాయత్​నగర్​లో జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. స్థానిక భాజపా కార్పొరేటర్ మహాలక్ష్మీ రామన్ గౌడ్​తో కలిసి నారాయణగూడలోని నాలాను పరిశీలించారు. నాలాలో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలింగిచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నాలాకు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని సూచించారు. బోయిన్​పల్లిలో నాలాలో పడి బాలుడు మృతి చెందారని... మళ్లీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నాలాకు ఇరువైపులా ప్రహరీ గోడ నిర్మించేందుకు నిధులు మంజూరు చేశామన్నారు.

ఇదీ చదవండి:RATION CARDS:పెండింగ్​లో ఉన్న 4,46,169 మందికి రేషన్ కార్డులు

ABOUT THE AUTHOR

...view details