తెలంగాణ

telangana

EC Focus on Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ఫోకస్.. విచ్చలవిడి వ్యయానికి అడ్డుకట్ట వేసేందుకు పక్కా ప్లాన్

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 8:53 AM IST

EC Focus on Telangana Assembly Elections : శాసనసభ ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై.. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఆ తరహా వాటిని గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో భారీగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఎక్కువగా వ్యయం చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలను.. సమస్యాత్మక నియోజకవర్గాలుగా పరిగణించనున్నారు.

Election Commission of India
Telangana Assembly Elections

EC Focus on Telangana Assembly Elections అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై ఈసీ ప్రత్యేక దృష్టి

EC Focus on Telangana Assembly Elections 2023 :రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ( Telangana Assembly Elections) డబ్బు ప్రభావంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. 2018 ఎన్నికల వేళ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ భారీగా నగదు, మద్యం, ఇతరత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల్లోనూ భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

Telangana Assembly Election 2023 : ఈసీ సైతం ప్రత్యేకంగా ఆరా తీసింది. తదుపరి జరిగిన పలు సమావేశాల సందర్భంలోనూ ఎలక్షన్ కమిషన్(Election Commission of India)అధికారులు ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో రానున్న శాసనసభ ఎన్నికల్లోనూ ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. విచ్చలవిడి ఎన్నికల వ్యయానికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు ప్రారంభించింది.

Telangana Assembly Elections 2023 : హైదరాబాద్​కు ఈసీ.. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

ఖర్చు విపరీతంగా పెట్టే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే జిల్లాల వారీగా.. రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందాలను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని దాదాపు 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను (Enforcement Agencies)రంగంలోకి దింపారు. ఇప్పటికే ఆయా బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తంలో నగదు విత్‌డ్రా చేస్తున్న వారిపై నిఘా పెట్టినట్లు సమాచారం.

గత ఎన్నికల్లో భారీగా నిధులు ఖర్చు చేసిన నియోజకవర్గాలు.. రానున్న ఎన్నికల్లో ఎక్కువ వ్యయం చేసే అవకాశం ఉన్న స్థానాలను గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. గత ఎన్నికల తీరు, ప్రస్తుత స్థానిక పరిస్థితులు, పోటీలో ఉండే అభ్యర్థులు.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ తరహా వాటిని గుర్తించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈసారి రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, ఖమ్మంలోని కొన్ని నియోజకవర్గాల్లో భారీగా డబ్బు ఖర్చు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం.. ఆ విషయాలపై ఈసీ ఆరా

సాధారణంగా శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలను.. సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తిస్తుంటారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దు ఉన్న 13 నియోజకవర్గాలను 2018 ఎన్నికల సమయంలో సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేసే అవకాశం ఉన్న వాటిని సైతం ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాలపై మొదటినుంచే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించనున్నారు.

Central Election Commission team will visit Telangana :మరోవైపు వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్​లో పర్యటించనున్న ఈసీ బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు రాజకీయ పార్టీలతో భేటీ కానుంది. అక్టోబర్ మూడో తేదీన జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణాపరమైన అంశాలపై చర్చలు జరపనుంది.

Voter Awareness Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. పోలింగ్ శాతం పెంచడంపై స్పెషల్ ఫోకస్

Telangana Assembly Elections 2023 : ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఈసీ కసరత్తు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details