తెలంగాణ

telangana

పోలీసులకు శానిటైజర్లు, మాత్రలు అందజేత

By

Published : May 10, 2021, 7:07 PM IST

కరోనా సమయంలోనూ కష్టపడి పనిచేస్తున్న పోలీసులకు కామ్ సన్ హెల్త్ కేర్ సంస్థ ఎండీ శానిటైజర్లు, శానిటైజర్ ట్యూబ్లు, మల్టీ విటమిన్ మాత్రలను రాచకొండ సీపీ మహేష్ భగవత్​కు అందజేశారు.

sanitizer and medicines distributed to police
పోలీసులకు శానిటైజర్లు, మాత్రలు అందజేత

కరోనా సెకండ్ వేవ్​లో వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో... పోలీసులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు కామ్ సన్ హెల్త్ కేర్ సంస్థ 200 శానిటైజర్స్​ను, వెయ్యి శానిటైజర్ ట్యూబ్స్​ను, 30 వేల మల్టీ విటమిన్ మాత్రలను అందజేశారు. సంస్థ ఎండీ మనీష్ కుమార్ గిలాడ వీటిని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్​కు అందజేశారు.

పోలీస్ సిబ్బంది గురించి ఆలోచించి వారికి సాయం చేసిన కామ్ సన్ హెల్త్ సంస్థ వారికి సీపీ మహేష్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా

ABOUT THE AUTHOR

...view details