IPL 2023 century : ఐపీఎల్లో ఇప్పటివరకు టైటిల్ ముద్దాడని జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒకటి. 16 సీజన్లలో 15 మంది కెప్టెన్లను మార్చిన పంజాబ్.. గత 3 సీజన్లలో వరుసగా ముగ్గురు కెప్టెన్లను మార్చింది. అయితే తాజాగా ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ను ఓడించి ప్లే ఆఫ్స్ రేసును రసవత్తరంగా మార్చింది. అయితే దిల్లీతో జరిగిన మ్యాచ్లో.. స్పిన్ పిచ్పై మిగిలిన బ్యాటర్లు రెండంకెల స్కోరును చేయడానికి కష్టపడితే.. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ మాత్రం(65 బంతుల్లో 103; 10x4, 6x6) సెంచరీ నమోదు చేశాడు. 42 బంతుల్లో అర్ధ శతం నమోదు చేసిన అతడు.. 61 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. అంటే 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. పంజాబ్ కింగ్స్కు 167 పరుగుల స్కోరును అందించాడు. జట్టును గెలిపించాడు.
ఐదుగురులో నలుగురు మనోళ్లే.. అయితే ఈ సీజన్లో ప్రభ్ సిమ్రన్ సింగ్ సింగ్తో పాటు ఇప్పటివరకు హ్యారీ బ్రూక్, వెంకటేశ్ అయ్యర్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్లు శతకాలు బాదారు. వీరిలో నలుగురు భారత బ్యాటర్లే కావడం విశేషం. ఇలా ఒకే సీజన్లో నలుగురు భారత ప్లేయర్లు శతకాలు నమోదు చేయడం ఇది రెండోసారి. అంతకుముందు 2019లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, అజింకా రహానే ఈ ఫీట్ను అందుకున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే.. యశస్వి జైస్వాల్, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఇద్దరూ కూడా అన్క్యాప్డ్ ప్లేయర్లే. ఐపీఎల్ హిస్టరీలో ఒకే సీజన్లో ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు శతకాలు చేయడం ఇదే ఫస్ట్ టైమ్.