తెలంగాణ

telangana

ఐపీఎల్​ టైటిల్​​ స్పాన్సర్​షిప్​ బరిలో పతంజలి!

By

Published : Aug 10, 2020, 3:39 PM IST

యోగా గురు రామ్​దేవ్ బాబా​ స్థాపించిన పతంజలి సంస్థ ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రతిపాదనను బీసీసీఐ ముందుకు తీసుకెళ్లనున్నట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

Patanjali ready to throw hat in the ring for IPL 2020 Title sponsorship
పంతంజలి

ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ బిడ్డింగ్​ రేసులో యోగా గురు రామ్​దేవ్​ బాబాకు చెందిన పతంజలి పాల్గొననున్నట్లు సమాచారం. ఇటీవలే చైనా స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ వివో ఈ ఒప్పందం నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. స్పాన్సర్​షిప్ విషయంలో ప్రాధాన్యం సంతరించుకుంది.

"పతంజలి బ్రాండ్​ను అంతర్జాతీయ మార్కెట్​లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ను పరిశీలిస్తున్నాం" అని సంస్థ ప్రతినిధి ఎస్కే టిజారావాలా ఇటీవలే ఓ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ప్రతిపాదనను బీసీసీఐ ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

ఐపీఎల్​లో తలపడే జట్లు

దేశంలో ప్రస్తుతం చైనా వ్యతిరేక భావన తీవ్రంగా ఉన్నందున వివోతో కుదుర్చుకున్న ఒప్పందానికి బీసీసీఐ స్వస్తి పలికింది. మరోవైపు బోర్డుకు నిధులు సమకూరుస్తున్న ఇతర చైనా కంపెనీ స్పాన్సర్లపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పతంజలి వంటి స్వదేశీ సంస్థతో ఈ సమస్యలన్నింటికీ తెరపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

స్పాన్సర్​షిప్​ బరిలో ఉన్న సంస్థలు

పతంజలితో పాటు అమెజాన్​, టాటా గ్రూప్​, డ్రీమ్​ 11, జియో, అదానీ, బైజూ సహా అనేక బ్రాండ్లు ఐపీఎల్​ టైటిల్​ స్పాన్సర్​షిప్​ కోసం పోటీ పడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details