తెలంగాణ

telangana

ఎన్టీఆర్​ షోలో సమంత.. గెలిచిన డబ్బులు ఆ ట్రస్ట్​కు!

By

Published : Oct 7, 2021, 10:19 PM IST

Updated : Oct 8, 2021, 11:48 AM IST

Samantha is the next guest on Evaru Meelo Koteeswarulu
సమంత

ముద్దుగుమ్మ సమంత(samantha akkineni husband).. భర్త నుంచి విడిపోయిన తర్వాత తొలిసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్​గా వ్యవహరిస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు గెస్ట్​గా సందడి చేయనుంది. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా జరిగింది.

గత కొద్దిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తూ వచ్చిన హీరోయిన్ సమంత(samantha and chaitanya).. ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు'(evaru meelo koteeswarudu 2021) షోకు విచ్చేసింది. ఎంత గెలుచుకుందో సరిగా తెలియనప్పటికీ, ఆ మొత్తాన్ని ప్రత్యూష ఫౌండేషన్​కు విరాళంగా అందజేసింది. అందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్​గా మారింది.

పరస్పర అంగీకారంతో నాగచైతన్య-సమంత ఇటీవల విడిపోయినట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, అభిమానుల్ని షాక్​కు గురిచేశారు.

కొన్నాళ్ల క్రితం 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్​లో నటించి మెప్పించిన సమంత(samantha marriage date).. 'శాకుంతలం'(shakuntalam release date) చిత్రంలో టైటిల్​ రోల్ చేసింది. గుణశేఖర్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

Last Updated :Oct 8, 2021, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details