తెలంగాణ

telangana

స్పీడ్ పెంచిన రవితేజ.. ఆగిన బెల్లంకొండ హీరో సినిమా!

By

Published : Jan 21, 2022, 11:42 AM IST

టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెలుగులో ప్రస్తుతం రెండు సినిమాలు తీస్తున్నారు. అయితే అందులో ఒకదానిని ఇప్పుడు ఆపేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే?

tiger nageswara rao biopics
టైగర్ నాగేశ్వరరావు మూవీస్

స్టూవర్టుపురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఏకకాలంలో రెండు సినిమాలు తీస్తుండటం ఇటీవల టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అందులో ఒకటి రవితేజ 'టైగర్‌ నాగేశ్వరావు', మరొకటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ 'స్టూవర్టుపురం దొంగ'. ఇప్పటికే 'స్టూవర్టుపురం దొంగ' షూటింగ్‌ ప్రారంభం కావడం.. సాయి శ్రీనివాస్‌పై పలు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ తీసుకున్న ఓ నిర్ణయంతో ఇప్పుడు బెల్లంకొండ హీరో సినిమా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ 'స్టూవర్ట్​పురం దొంగ' మూవీ

సాధారణంగానే బయోపిక్‌లకు ప్రేక్షకాదరణ మెండుగా ఉంటుంది. అందులోనూ గజదొంగ జీవితం కావడం వల్ల ఈ బయోపిక్‌పై అందరిలో ఆసక్తి ఎక్కువగానే ఉంది. దాంతో 'టైగర్‌ నాగేశ్వరరావు' చిత్రాన్ని పాన్‌ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ చిత్రబృందం భావించింది. ఈ క్రమంలోనే ఆ సినిమాను త్వరితగతిన పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేయాలని సదరు టీమ్‌ భావిస్తుందట.

రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ

దీంతో అదే కథతో తెరకెక్కుతోన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ 'స్టూవర్టుపురం దొంగ' సినిమా ఆపేయాలని ఈ చిత్రబృందం భావిస్తుందట. ఈ మేరకు సినిమా షూటింగ్‌ కూడా నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details