తెలంగాణ

telangana

'ప్రవాస భారతీయుల విజయాలు మనకెంతో గర్వకారణం'

By

Published : Jan 9, 2022, 11:28 AM IST

f
f

17th Pravasi Bharatiya Divas: ప్రవాస భారతీయులు.. ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు ప్రధాని నరేంద్రమోదీ. అన్ని రంగాల్లోనూ ప్రవాస భారతీయులు రాణిస్తున్నారన్నారు. 17వ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్​ చేశారు.

17th Pravasi Bharatiya Divas: 17వ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను ప్రశంసించారు ప్రధాని మోదీ. వాళ్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, అన్ని రంగాల్లోనూ ప్రవాస భారతీయులు రాణిస్తున్నారన్నారని ట్వీట్ చేశారు మోదీ.

ప్రధాని మోదీ ట్వీట్

"అందరికీ శుభాకాంక్షలు. ప్రవాస భారతీయులు ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అన్ని రంగాల్లోనూ వాళ్లు రాణిస్తున్నారు. అంతేకాక స్వదేశంతో సంబంధాలు కలిగి ఉన్నారు. వారి విజయాలను మేము గర్విస్తున్నాం."

-- ప్రధాని నరేంద్రమోదీ

వెంకయ్య ట్వీట్..

17th Pravasi Bharatiya Divas: 17వ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు దేశాభివృద్ధిలో తోడ్పడాలని కోరారు. మునుపటిలాగే.. దేశ సంస్కృతికి బ్రాండ్​ అంబాసిడర్​లుగా వ్యవహరించాలన్నారు.

వెంకయ్యనాయుడు ట్వీట్​

ఈ మేరకు వివిధ రంగాల్లో వాళ్లు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి:'గురుగోవింద్ జీవిత సారాంశం.. లక్షలమందికి ధైర్యం'

ABOUT THE AUTHOR

...view details