భూమిపై స్థలాలు కొనడం మానేసి.. ఏకంగా చంద్రుడిపైనే తిష్ట వేసేందుకు చూస్తోంది నేటి తరం. అదే ఆలోచన వచ్చిన ఒడిశాకు చెందిన అభయ్ సేనాపతి.. తన కూతురి జన్మదినం సందర్భంగా చంద్రునిపై ఎకరం స్థలం కొని, కానుకగా ఇచ్చాడు.
కేంద్రపాడా జిల్లాలోని పట్టముండాయి ప్రాంతానికి చెందిన అభయ్.. జనవరి 15న తన కుమార్తె పుట్టిన రోజున వినూత్న బహుమతి ఇవ్వాలనుకున్నాడు. రూ.10వేలు చెల్లించి.. చంద్రునిపై ఎకరం స్థలం కొనుగోలు చేశాడు.