తెలంగాణ

telangana

హ్యాండ్​ బ్యాగ్​లో రూ.25కోట్ల బంగారం.. 48 కిలోల పేస్ట్​ రూపంలో తరలిస్తుండగా..

By

Published : Jul 10, 2023, 8:54 AM IST

Updated : Jul 10, 2023, 9:50 AM IST

Gold Smuggling In Surat : అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 25 కోట్ల విలువైన 48 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు డీఆర్​ఐ అధికారులు. హ్యాండ్ బ్యాగులో అక్రమంగా తరలిస్తుండగా సూరత్ విమానాశ్రయంలో పట్టుకున్నారు.

gold smuggling in surat
gold smuggling in surat

Gold Smuggling In Surat : దుబాయ్​ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 25 కోట్లు విలువైన బంగారాన్ని పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులు షాక్​కు గురయ్యారు. దాదాపు 48 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చి, హ్యాండ్​ బాగుల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. నలుగురిని పట్టుకున్నారు. ఈ ఘటన జులై 7న జరగగా.. డీఆర్​ఐ ఆదివారం ప్రకటన చేసింది.

ఇదీ జరిగింది
దుబాయ్- షార్జా నుంచి వస్తున్న ఎయిర్​ఇండియా విమానంలో అక్రమ బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన డైరక్టరెట్​ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజన్స్​ అధికారులు.. వెంటనే సూరత్​ విమానాశ్రయం చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే హ్యాండ్ బ్యాగ్​లో తనిఖీ చేయగా.. పేస్ట్ రూపంలో బంగారం లభ్యమైంది. వెంటనే నలుగురిని శనివారం అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం అరెస్ట్ చేసి డీఆర్​ఐ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ బంగారం విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీరిని సూరత్​లోని రాందేర్​కు చెందిన వారిగా గుర్తించారు. ఇప్పటివరకు పట్టుకున్న వాటిలో ఇదే అతిపెద్దదని అధికారులు చెప్పారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం
అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం

"ఎయిర్​ఇండియా ఎక్స్​ప్రెస్ IX172 విమానంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారని సమాచారం అందింది. తనిఖీ చేయగా.. హ్యాండ్ బ్యాగ్​లో 43.5 కిలోల పేస్ట్ రూపంలో ఉన్న బంగారం లభించింది. వీటిని బ్యాగులోని ఐదు బెల్టుల్లో 20 తెలుపు రంగు పాకెట్లలో పెట్టి తీసుకువచ్చారు. సూరత్​ విమానాశ్రయంలో ఉన్న ఓ అధికారి సహకారంతో అక్రమ రవాణాకు ప్లాన్ చేశారు. ఇమ్మిగ్రేషన్​ చెక్ పాయింట్​కు ముందు ఉన్న టాయిలెట్​లో మార్చుకునేందుకు ప్లాన్​ చేశారు. ఆ తర్వాత మరో 4.67 కిలోల పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని టాయిలెట్​లో లభించింది. దీనిని సీఐఎస్​ఎఫ్​ అధికారులు స్వాధీనం చేసుకుని.. డీఆర్​ఐకి అప్పగించింది."
--డీఆర్​ఐ అధికారులు

పేస్ట్ రూపంలో రూ. 2 కోట్ల బంగారం
అచ్చం ఇలాంటి ఘటనే శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల జరిగింది. పేస్ట్ రూపంలో తరలిస్తున్న అక్రమ బంగారాన్ని ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన నలుగురు మహిళలను నిఘా విభాగం అధికారులు తనిఖీ చేశారు. వారు పేస్ట్‌ రూపంలో బంగారు క్యాప్సూల్స్‌ తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మలద్వారంలో దాచుకుని తెచ్చినట్లు గుర్తించారు. వారి నుంచి అధికారులు బంగారం క్యాప్సూల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. రూ.1.94 కోట్లు విలువైన 3,175 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఆ మేరకు వారిపై కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం

ఇవీ చదవండి :ఎయిర్​పోర్ట్​లో భారీగా బంగారం పట్టివేత.. చాక్లెట్ పౌడర్​లో కలిపి డబ్బాల్లో తరలిస్తూ..

Gold seizure at Shamshabad airport : పేస్ట్ రూపంలో.. పొడి రూపంలో... శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్

Last Updated :Jul 10, 2023, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details