ETV Bharat / bharat

ఎయిర్​పోర్ట్​లో భారీగా బంగారం పట్టివేత.. చాక్లెట్ పౌడర్​లో కలిపి డబ్బాల్లో తరలిస్తూ..

author img

By

Published : Jan 9, 2023, 10:19 AM IST

అక్రమంగా తరలిస్తున్న 20 తులాల బంగారాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లి ఎయిర్​పోర్ట్​లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బంగారాన్ని పొడి చేసి చాక్లెట్ పౌడర్ డబ్బాలో కలిపి తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Heavily seized gold at the airport in tamil nadu
విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 211 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పొడి చేసి​ మూడు చాక్లెట్ పౌడర్ డబ్బాల్లో కలిపి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్​ఇండియా విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ బంగారం లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ప్రయాణికుడి చెక్​-ఇన్ బ్యాగేజీలో కూడా 175 గ్రాముల బంగారు గొలుసులు కూడా లభించాయని వెల్లడించారు. మొత్తం బంగారం విలువ రూ.21.55 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

Heavily seized gold at the airport in tamil nadu
చాక్లెట్ పౌడర్​లో కలిపిన బంగారం పొడి

విమానాశ్రయంలో రూ.70 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత..
తమిళనాడులో తిరుచిరాపల్లి విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి బ్యాగ్​.. బ్యాక్​ప్యాక్​లో రూ.70 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసుకున్నారు.

70 lakh foreign currency seized
రూ.70 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత

3.54 కిలోల బంగారం పట్టివేత..
అదే రాష్ట్రంలో కోయంబత్తూర్​ ఎయిర్​పోర్ట్​లో ఆదివారం షార్జా నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికుల వద్ద 3.54 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2.05 కోట్లు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడతున్నట్లు అధికారులు చెప్పారు.

Heavily seized gold in tamil nadu
బంగారం పట్టివేత

తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 211 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పొడి చేసి​ మూడు చాక్లెట్ పౌడర్ డబ్బాల్లో కలిపి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్​ఇండియా విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ బంగారం లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ప్రయాణికుడి చెక్​-ఇన్ బ్యాగేజీలో కూడా 175 గ్రాముల బంగారు గొలుసులు కూడా లభించాయని వెల్లడించారు. మొత్తం బంగారం విలువ రూ.21.55 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

Heavily seized gold at the airport in tamil nadu
చాక్లెట్ పౌడర్​లో కలిపిన బంగారం పొడి

విమానాశ్రయంలో రూ.70 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత..
తమిళనాడులో తిరుచిరాపల్లి విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి బ్యాగ్​.. బ్యాక్​ప్యాక్​లో రూ.70 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసుకున్నారు.

70 lakh foreign currency seized
రూ.70 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత

3.54 కిలోల బంగారం పట్టివేత..
అదే రాష్ట్రంలో కోయంబత్తూర్​ ఎయిర్​పోర్ట్​లో ఆదివారం షార్జా నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికుల వద్ద 3.54 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2.05 కోట్లు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడతున్నట్లు అధికారులు చెప్పారు.

Heavily seized gold in tamil nadu
బంగారం పట్టివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.