21:01 June 20
పల్నాడు జిల్లాలో ఘటన
పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ అచ్చంపేట గేట్ సమీపంలో.. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కిందపడి ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులు తల్లి, ఇద్దరు కుమారులు అని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. తల్లి వయసు సుమారు 35 ఉంటుందని.. కుమారులకు 7, 10 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: