ETV Bharat / crime

Suicide: ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

author img

By

Published : Feb 8, 2022, 3:12 PM IST

Updated : Feb 8, 2022, 4:04 PM IST

woman Suicide at Prakasam
woman Suicide at Prakasam

woman Suicide at Prakasam: అందరూ చూస్తుండగానే ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా చినగంజాంలో జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

woman Suicide at Prakasam: ఇద్దరు పిల్లలతో సహా గుర్తుతెలియని మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా చినగంజాంలో జరిగింది. సోపిరాల రైల్వేగేటు సమీపంలో అందరూ చూస్తుండగానే ఒంగోలు నుండి చీరాల వైపు వెళుతున్న ఎక్స్​ప్రెస్ రైలు కింద పడి.. ఆత్మహత్య చేసుకుంది.

మహిళ శరీరం పూర్తిగా చిద్రమైపోయింది. పిల్లల ఇద్దరి వయస్సు ఆరు సంవత్సరాలలోపే ఉంటుందని స్థానికులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:

పోలీసులే కారణమంటూ.. నలుగురు మహిళల ఆత్మహత్యాయత్నం..!

Last Updated :Feb 8, 2022, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.