ETV Bharat / state

పోలీసులే కారణమంటూ.. నలుగురు మహిళల ఆత్మహత్యాయత్నం..!

author img

By

Published : Feb 7, 2022, 3:26 PM IST

Updated : Feb 7, 2022, 7:00 PM IST

నలుగురు మహిళల ఆత్మహత్యాయత్నం
నలుగురు మహిళల ఆత్మహత్యాయత్నం

15:22 February 07

అనంతలో నలుగురు మహిళల ఆత్మహత్యాయత్నం

Suicide Attempt: పోలీసులు తమ భర్తను వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ కుటుంబంలోని నలుగురు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఓ చోరీ కేసులో.. మడకశిర పోలీసులు కావాలనే ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ నిద్రమాత్రలు మింగారు. వీరిని హిందూపురం ఆసుపత్రికి తరలించగా..వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురం పట్టణంలోని త్యాగరాజునగర్​కు చెందిన రామాంజీ అనే వ్యక్తిని ఓ దొంగతనం కేసులో మడకశిర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి సంబంధించిన బంగారం రికవరీ కోసం రామాంజీ కుటుంబసభ్యులపై ఒత్తిడి చేశారు.

దీంతో మనస్థాపం చెందిన రామాంజీ భార్యతో పాటు అతని అక్క కుటుంబంలోని మరో ఇద్దరు మహిళలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన బంధువులు వారిని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే.. రామాంజీ అతని కుటుంబ సభ్యులు గతంలో పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిపై వివిధ పోలీసు స్టేషన్లలో 50కి పైగా కేసులు ఉన్నాయని వెల్లడించారు.

ఇదీ చదవండి

అమానవీయం: లేడీ కానిస్టేబుల్స్​కు జెంట్ టైలరింగ్!

Last Updated : Feb 7, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.