ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు బాలురు మృతి

author img

By

Published : Jun 20, 2022, 7:09 PM IST

Updated : Jun 20, 2022, 8:12 PM IST

గల్లంతు
గల్లంతు

19:05 June 20

పుల్లలచెరువు మండలం కవలకుంట్ల చెరువులో ఈతకు దిగి మృతి

ఈత సరదా ఆ పిల్లల పాలిట శాపంగా మారింది. సరదా కోసం ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి చెందారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. పుల్లలచెరువు మండలం కవలకుంట్లలో ఈత కొట్టేందుకు నలుగురు పిల్లులు చెరువులోకి దిగారు. కాసేపు సరదాగా గడిపారు. అంతలోనే ప్రమాదవశాత్తు ఆ నలుగురు పిల్లలు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. మృతులు సాయిరెడ్డి (12), విష్ణుకుమార్‌రెడ్డి ‍(13), బ్రహ్మారెడ్డి, మణికంఠ ‍(14)గా గుర్తించారు. పిల్లల మరణవార్తతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కన్నవారి రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి.

ఇదీ చదవండి:

Last Updated :Jun 20, 2022, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.