తెలంగాణ

telangana

మరో సమరానికి మానుకోట సిద్ధం- బీజేపీ గూటిలోకి చేరేందుకు సిద్ధమైన సీతారాం నాయక్

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 9:02 AM IST

Mahabubabad MP Candidates : పార్లమెంటు ఎన్నికలకు మహబూబాబాద్ నియోజకవర్గానికి ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ వేడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మరోసారి టిక్కెట్ దక్కించుకోగా సిట్టింగ్ స్థానం నుంచి బీఆర్ఎస్(BRS) తరఫున మాలోత్ కవిత మరోసారి బరిలోకి దిగారు. ఇవాళ కాషాయ కండువా కప్పుకోనున్న బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగనున్నారు.

Mahabubabad MP Candidates
Mahabubabad MP Candidates

Mahabubabad MP Candidates

Mahabubabad MP Candidates : గిరిపుత్రుల ఖిల్లాగా పిలిచే మహబూబాబాద్ పార్లమెంటు(Parliament) నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల షెడ్యూల్(Election Schedule) వెలువకడముందే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారైయ్యాయి. కాంగ్రెస్ నుంచి మరోసారి కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ బరిలో నిలిచి, అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత మరోసారి పోటీకి నిలిచారు. బీజేపీ ఇంకా తన అభ్యర్థిని అధికారికంగా వెల్లడించలేదు.

కమలం గూటిలో చేరనున్న సీతారాం నాయక్
శుక్రవారం వరంగల్ పర్యటనలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుకిషన్‌రెడ్డిబీఆర్ఎస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అనుచరులు, మద్దతుదారులతో చర్చించిన సీతారాంనాయక్ కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ దిల్లీలో బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. సీతారాంనాయక్‌ చేరికతో మహబూబాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పేరు లాంఛనం కానుంది. ఇక్కడి నుంచి పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న హుస్సేన్‌నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించడంతో సీతారాంనాయక్‌కు మార్గం సుగుమమైంది.

తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రధాని నిధులు మంజూరు చేయడం హర్షనీయం : కిషన్​ రెడ్డి

Mahabubabad Political Background :2009 పార్లమెంట్ పునర్విభజన చట్టం ప్రకారం మహబూబాబాద్ లోక్‌సభనియోజకవర్గం(Lok Sabha constituency) ఏర్పడింది. అంతకు పూర్వం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో అంతర్భాగంగా ఈ ప్రాంతం ఉండేది. ST రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన మహబూబాబాద్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ పార్లమెంటరీ నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన బలరాం నాయక్. 2009లో తొలిసారి ఇక్కడి నుంచే పోటీచేసి, ఎంపీగా(MP) విజయం సాధించారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో కేంద్ర సామాజిక , సాధికారత, న్యాయశాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2014 లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ చేతిలో, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన మాలోత్ కవిత చేతిలో బలరాంనాయక్‌ ఓడిపోయారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచార స్పీడు పెంచిన బీజేపీ - అమిత్​ షా రాకతో కొత్త జోష్!

Mahabubabad political war among parties : శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావటంతో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాలో భారీ విజయాలతో మహబూబాబాద్(Mahabubabad) లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసేందుకుకాంగ్రెస్‌లో గట్టి పోటీ నెలకొంది. 47మంది కాంగ్రెస్‌ నాయకులు ఇక్కడి నుంచి టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా చివరకు బలరాంనాయక్‌నే టికెట్ వరించింది. ఈ సారి ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని బలరాంనాయక్ భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, శాసనసభ ఎన్నికల్లో భారీ విజయాలు, ఒక్కొక్కటిగా అమలవుతున్న ఎన్నికల హామీల నేపథ్యంలో తన గెలుపు ఖాయమని బలరాంనాయక్‌ ధీమాతో ఉన్నారు.

గెలుపుపై దీమా వ్యక్తం చేస్తోన్న మాలోత్ కవిత
మరోవైపు బీఆర్ఎస్ నుంచి రెండోసారి పోటీచేస్తున్న మాలోత్ కవిత సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఇచ్చిన హామీలు అమలుకావటంలేదంటూ అధికార పార్టీపై విమర్శలతో ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్‌ నాయకత్వం, పార్టీకి బలమైన క్యాడర్‌, తమకున్న ఓటు బ్యాంకుతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు తమకు కలిసొస్తాయని భావిస్తున్నారు. అటు బీజేపీ సైతం మానుకోటపై కాషాయ జెండా ఎగరేయాలని తహతహలాడుతోంది. బలమైన అభ్యర్థినే రంగంలోకి దించాలని భావిస్తూ వచ్చిన ఆ పార్టీ నాయకత్వం మాజీ ఎంపీ సీతారాంనాయక్‌కే టికెట్‌ ఖరారు చేయనుండటంతో ముగ్గురు బలమైన అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉండనున్నారు.

Mahabubabad Voters :మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 15లక్షల 24వేల 986 మంది ఓటర్లు ఉండగా వీరిలో స్త్రీలు అత్యధికంగా ఉన్నారు. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఇందులో గ్రామీణ ప్రాంత జనాభా 87శాతం ఉండగా పట్టణ ప్రాంత జనాభా కేవలం 13 శాతంగా ఉంది. గిరిజనులు , ఆదివాసీలు ఎక్కువగా నివసించే ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరుపుత్రులే గెలుపు నిర్దేశకులవుతారు. ఎన్నికల షెడ్యూల్ వెలవడిన నాటినుంచే ప్రచారాలు హోరెత్తనున్నాయి.

అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే - బిజీబిజీగా గడపనున్న కేంద్రమంత్రి

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details