'మంత్రి కాగానే అన్నీ మర్చిపోతారా? జబర్దస్త్​ గురించి అప్పుడు చెప్పినవన్నీ అబద్ధాలేనా?'

By

Published : Oct 6, 2022, 1:30 PM IST

Updated : Oct 6, 2022, 2:22 PM IST

thumbnail

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్​గా కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులను బాగా అలరించారు సీనియర్​ నటి రోజా. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకున్నారు. బుల్లితెర పాపులర్​ షో అయిన జబర్దస్త్​లోనూ జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్​​క్రేజ్​ను సంపాదించుకుని రాజకీయాల్లో మరిన్ని బాధ్యతలు పెరగడం వల్ల షో నుంచి తప్పుకున్నారు. ఇటీవలే దసరా పండగ సందర్భంగా ఈటీవీ ఛానల్​లో ప్రసారమైన ఓ ప్రత్యేక షోకు వచ్చిన ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఆ సమయంలో గతేడాది దసరా వేడుకల్లో రోజా.. జబర్దస్త్​ గురించి మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియో అయ్యాక కమెడియన్​ నూకరాజు​..'జబర్దస్త్​ అంటే ఇష్టం.. అంతా నా ఫ్యామిలీ అని అప్పుడు మీరు(రోజా)చెప్పారు. మంత్రి అయ్యాక జబర్దస్త్​ను వదిలి వెళ్లిపోయారు. అయితే మీరు జబర్దస్త్​ గురించి చెప్పింది నిజం అనుకోవాలా.. మంత్రి అవ్వగానే వదిలి వెళ్లిపోవడం నిజం అనుకోవాలా?' అంటూ రోజాను అడిగారు. వెంటనే రోజా.. 'నన్ను పిలిచింది అవమానించడానికా?' అంటూ పూలదండ విసిరి కన్నీరు పెట్టుకుని వెళ్లిపోయారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.

Last Updated : Oct 6, 2022, 2:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.