'నేనేం అనలేదు అక్క.. క్షమించి వదిలెయ్ ప్లీజ్..'

By

Published : Apr 3, 2023, 12:51 PM IST

thumbnail

మహిళలను చూడగానే ఏదో ఒకటి అంటుంటారు కొందరు ఆకతాయిలు. వాళ్లేం చేస్తారులే, ఏదైనా అనొచ్చు అనే ధోరణిలో కొందరు వ్యక్తులు అలా ప్రవర్తిస్తుంటారు. బైక్​లపై వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి కామెంట్ చేస్తే.. వాళ్లు ఆగి ఏం అంటారులే అనే దీమాతో అసభ్యంగా మాట్లాడుతుంచారు. కానీ.. అన్నిసార్లు వాళ్లు అనుకున్నట్లు ఉండదుగా. మహిళలు తిరగబడ్డప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది.  

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిని చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ పట్టణంలో తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళతో.. వెనుక నుంచి మరో బైక్​పై వస్తున్న యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ద్విచక్ర వాహనాన్ని ఆపించి కిందకు దిగిన ఆ మహిళ.. నడిరోడ్డుపైనే ఆ యువకుడికి దేహశుద్ధి చేసింది. జుట్టు పట్టుకుని చెప్పుతో చితక్కొట్టింది. పక్కన ఉన్నవారు ఆపే ప్రయత్నం చేసినా.. ఆగకుండా ఎడాపెడా దంచింది. 'నేనేం అనలేదు అక్క.. క్షమించి వదిలెయ్​ ప్లీజ్' అని వేడుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.