విడాకులు మంజూరైన వెంటనే భర్తను కోర్టులోనే చితకబాదిన భార్య బంధువులు

By

Published : Dec 28, 2022, 10:49 AM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ యువకుడిని కొందరు మహిళలు చితక్కొట్టారు. ముజఫర్​నగర్​లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ దాడి జరిగింది. ముజఫర్​నగర్​కు చెందిన సబియా అనే యువతికి మేరఠ్​కు చెందిన రషీద్​తో వివాహం జరిగింది. అయితే వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. రాజీకి ప్రయత్నించినా విఫలం కాగా విడాకులు కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి వాదనలు విని విడాకులు మంజూరుచేసింది. విడాకులు మంజూరైన అనంతరం రషీద్​పై సబియా కుటుంబసభ్యులు దాడికి దిగారు. ముగ్గురు మహిళలు ఒక్కసారిగా రషీద్​ను చుట్టుముట్టి కొట్టారు. వెంటనే అప్రమత్తమైన రషీద్​ కుటుంబసభ్యులు చుట్టుపక్కల వారి సాయంతో వారిని అడ్డగించారు. ఈ గొడవ మొత్తాన్ని ఒకరు వీడియో తీయగా ప్రస్తుతం ఇది స్థానికంగా వైరల్​గా మారింది.

Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.