శ్రీనివాస్‌ గౌడ్​పై టూరిజం ఫర్నీచర్ తరలింపు వివాదం, ఆందోళనకు దిగిన ఓయూ విద్యార్థులు

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2023, 5:08 PM IST

thumbnail

OU Students Block Ex Minister Srinivas Goud Office Furniture : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్రమంగా తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. హైదరాబాద్​ రవీంద్ర భారతిలోని శ్రీనివాస్‌ గౌడ్‌ ఆఫీసులోని కంప్యూటర్లు, ఫర్నిచర్‌, పలు దస్త్రాలను ఓ వాహనంలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఓయూ విద్యార్థి నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వ వస్తువులను మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అనుచరులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘా నేతలు ఆందోళనకు దిగారు. 

అనంతరం సైఫాబాద్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి సంఘం నాయకుడు మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన సామగ్రిని అక్రమంగా మాజీ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తరలించే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి సంఘం నాయకుడు ఆరోపించారు. రాష్ట్రంలో నాయకులు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సామగ్రిని తరలించే ప్రయత్నం చేస్తున్నారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.  

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.