Man Carrying Wife Body In Rickshaw : భార్య మృతదేహాన్ని రిక్షాలో తీసుకెళ్లిన భర్త.. 5కి.మీ తోసుకుంటూనే..

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 10:31 PM IST

Updated : Oct 8, 2023, 7:09 AM IST

thumbnail

Man Carrying Wife Body In Rickshaw : అంబులెన్స్ సదుపాయం లేక భార్య మృతదేహాన్ని రిక్షాలో 5 కి.మీ తోసుకుంటూ వెళ్లాడు ఆమె భర్త. అందుకు ఆమె కుటుంబ సభ్యులు సహకరించారు. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలోని బాలేశ్వర్​ జిల్లాలో శుక్రవారం జరిగింది.

ఇదీ జరిగింది
దహిసద గ్రామంలోని చాపుల్యాకు చెందిన గుర్బా సింగ్​, మమతా సింగ్ భార్యాభర్తలు. అయితే, మమతా సింగ్​కు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్​కు తీసుకెళ్లాడు ఆమె భర్త. ఈ క్రమంలోనే చికిత్స పొందుతున్న మమతా సింగ్​.. శుక్రవారం సాయంత్రం మరణించింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్​ ఇవ్వాలంటూ ఆస్పత్రి వర్గాలను కోరాడు భర్త. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల.. ప్రైవేట్ అంబులెన్స్​లను ఆశ్రయించగా వారు రూ. 1,500 డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడం వల్ల.. ఆ మొత్తాన్ని ఇచ్చుకోలేక రిక్షాలో మహిళ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు భర్త. ప్రజల కోసం ఒడిశా ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టినా.. అవి ప్రజల వద్దకు చేరడం లేదు. పుట్టుక నుంచి మరణం వరకు అందరికి ఉచిత అంబులెన్స్​ అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే గుర్బా సింగ్​.. అంబులెన్స్ ఇవ్వాలని కోరినా.. అధికారులు పట్టించుకోలేదు.

Last Updated : Oct 8, 2023, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.