MLA Sudheer Reddy Basti Bathakhani : ప్రజా సమస్యల పరిష్కారానికి MLA సుధీర్​రెడ్డి 'బస్తీ బాతాఖానీ'

By

Published : May 20, 2023, 7:41 PM IST

thumbnail

MLA Sudheer Reddy Basti Bathakhani : ఎల్బీనగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన్సూరాబాద్ డివిజన్​లోని వీరన్నగుట్ట కాలనీలో.. బస్తీ బాతాఖానీ (బస్తీ నిద్ర) కార్యక్రమాన్ని స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. స్థానిక వీరన్నగుట్టతో పాటు పరిసర కాలనీల్లో ఆయా సంబంధిత అధికారులతో కలిసి తిరుగుతూ ప్రజలను పలకరించి సమస్యలపై ఆరా తీశారు.

రేపు ఉదయం 6 గంటల వరకు కాలనీలో పరిస్థితులను పరిశీలించి.. కాలనీవాసుల సమస్యలను పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకుంటానని అన్నారు. ఇప్పటికే తాగు నీరు, విద్యుత్​దీపాలు, డ్రైనేజీ మొదలగు అభివృద్ధి పనులు చేసినట్లు, రోడ్ల సమస్యలు ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. దశల వారీగా ప్రజా సమస్యలను అన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా సంబంధిత అధికారులతో పాటు స్థానిక బీఆర్​ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.