శంకర్‌పల్లిలో సినీనటి రష్మి గౌతమ్ సందడి - తరలివచ్చిన అభిమానులు

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 10:39 PM IST

thumbnail

Jabardasth fame Rashmi Gautham in Shankarpally : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో జబర్ధస్త్‌ ఫేమ్‌, సినీనటి రష్మి గౌతమ్(Rashmi Gautham) సందడి చేశారు. సంప్రదాయ చీరకట్టులో ముస్తాబై ఓ ఫ్యాషన్‌ షాపింగ్‌ మాల్‌ను ఆమె ప్రారంభించారు. రష్మిక తమ ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు ఆమెను చూడటానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

Actress Rashmi Gautam in Shankarpally : దీంతో అక్కడి ప్రాంతమంతా అభిమానులతో కిక్కరిసిపోయింది. వారి కేరింతలతో షాపింగ్ మాల్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఆమెను చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువతి, యువకులకు రష్మీ గౌతమ్​ను అభివాదం చేస్తూ వారిలో ఉత్సహం నింపారు. తన కోసం ఇంత మంది తరలి రావడం చాలా సంతోషంగా ఉందని మీ ప్రేమాభిమానలను ఇలాగే కొనసాగించాలని కోరారు. సందర్భానికి తగిన విధంగా వస్త్రాదరణ ఉండాలని అన్నారు. వివిధ వస్తువుల కొనుగోళ్లకు ఆన్​లైన్ షాపింగ్​కు కాకుండా ఆఫ్​లైన్ షాపింగ్ చేయాలని రష్మీ గౌతమ్ సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.