Interview With TSRTC Chairman : టీఎస్​ఆర్టీసీ ఉద్యోగికి ఎంత వేతనం పెరగనుంది?.. ఎప్పటి నుంచి?

By

Published : Aug 2, 2023, 5:29 PM IST

Updated : Aug 2, 2023, 8:02 PM IST

thumbnail

Interview With TSRTC Chairman Bajireddy Govardhan : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వంలో విలీనం అయినా.. సంస్థ అలాగే ఉంటుందని ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రోడ్డు రవాణా కార్పొరేషన్ అలాగే ఉంటుందని.. దానికి ఛైర్మన్‌, ఎండీ కొనసాగుతారని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కమిటీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్రాల్లో పర్యటించి.. దానిలో ఉన్న లాభాలను, నష్టాలను అంచనా వేయనుందని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తర్వాత నిజామాబాద్​కు వచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు సంస్థ ఉద్యోగులు, కార్మికులు ఘన స్వాగతం పలికారు. బాజిరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్‌ను కార్మికులు, ఉద్యోగులు సన్మానించారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ ఏర్పాటైందని.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెడుతుందని వెల్లడించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు వేతనం ఎంత పెరగనుంది? పీఎఫ్​ ఎలా ఇస్తారు? ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో ముఖాముఖి.

Last Updated : Aug 2, 2023, 8:02 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.