పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ సృష్టిస్తుంది : కడియం కావ్య - lok sabha elections 2024
Published : May 9, 2024, 7:28 PM IST
Warangal Kadiam Kavya Interview : మనకోసం కాకుండా వ్యవస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తేనే ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు వస్తుందని, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. హనుమకొండలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కావ్య పాల్గొన్నారు. గత పదేళ్లుగా కడియం ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు అందించానన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆనాథ ఆశ్రమాలలో పలు సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యారాలైన తాను, మున్ముందు మరిన్ని సేవలందించడానికే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని ఆమె చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కావ్య ఆరోపించారు. అందుకనే ఈప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టిందని ఆరోపించారు.
వరంగల్లో తాను భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గాలిలో అధికారంలోకి రాలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో సునామీ సృష్టిస్తుందని స్పష్టం చేశారు. వరంగల్లో చాలా సమస్యలు నెలకొన్నాయని, తాను ఎంపీగా గెలిస్తే జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.