గంటల వ్యవధిలోనే రెండు రైలు ప్రమాదాలు- పట్టాలు తప్పిన గూడ్స్

By PTI

Published : Dec 11, 2023, 12:03 PM IST

thumbnail

Goods Train Derailed : గంటల వ్యవధిలోనే రెండు వేర్వేరు ప్రాంతాల్లో రైళ్లు ప్రమాదాలు సంభవించాయి. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో గూడ్స్​ రైలుకు చెందిన 10 బోగీలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పాయి. చెన్నై హార్బర్​కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ గూడ్స్​ రైలులో ఇనుము సామగ్రితో పాటు మెటల్​ షీట్లను రవాణా చేస్తున్నారు. ఈ ప్రమాదంతో పలు ప్యాసెంజర్​ రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడినట్లు చెంగల్పట్టు స్టేషన్​ అధికారులు చెప్పారు. వెంటనే పట్టాల పునరుద్ధరణ పనులు చేపట్టారు.

మహారాష్ట్రలోనూ పట్టాలు తప్పిన గూడ్స్​
మరోవైపు మహారాష్ట్ర ఠాణె జిల్లాలోని కసారాలో కూడా ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు గూడ్స్​ రైలుకి చెందిన 7 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే ట్రాక్​ పునరుద్ధరణ పనులు చేపట్టి మెయిన్​లైన్​ రైలు సేవలను తిరిగి ప్రారంభించారు అధికారులు. మిగతా ట్రాక్​ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఆర్​పీఓ తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.