Agriculture Drones in Sangareddy: 6 నిమిషాల్లో ఎకరం పొలానికి మందు పిచికారి.. డ్రోన్లతో సాగులో దూసుకెళ్తున్న రైతన్న

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 2:54 PM IST

thumbnail

Agriculture Drones in Sangareddy : ప్రస్తుత తరుణంలో రైతును ప్రధానంగా వేధిస్తున్న సమస్యల్లో కూలీల కొరత ఒకటి. సమయానికి కూలీలు దొరక్కపోవడం.. దొరికినా వారికి కూలీ డబ్బు చెల్లించలేక కర్షకులు సాగు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించడానకి అన్నదాతలు.. సాంకేతికత వైపు మళ్లుతున్నారు. పంట చేలలో వచ్చే చీడపీడలు, వివిధ రకాల తెగుళ్లను నియంత్రించడానికి డ్రోన్​ స్ప్రేయర్లను వినియోగిస్తున్నారు. తక్కువ సమయంలో డ్రోన్‌ స్ప్రేయర్​ సాయంతో పంటకు క్రిమిసంహారకాలను పిచికారి చేస్తూ కూలీల కొరతను అధిగమిస్తున్నారు. 

Pesticide Drones Sangareddy : డ్రోన్ల సాయంతో ఎకరాకు 500 రూపాయల ఖర్చుతో.. 6 నిమిషాల్లోనే ఎకరం పొలంలో విస్తీర్ణంలో మందు పిచికారి చేస్తున్నారు. సంగారెడ్డికి చెందిన కృష్టయ్య అనే రైతు 6 లక్షల రూపాయలతో డ్రోన్‌ కొనుగోలు చేసి తమ పొలంతో పాటు.. ఇతరుల పొలంలో సైతం పిచికారి చేస్తున్నారు. దీంతో కూలీల బాధ తగ్గడంతో పాటు.. తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో మందు పిచికారి చేసుకోగలుగుతున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్ల గురించి.. వాటితో పంటకు మందు పిచికారి చేయడం గురించి   అన్నదాతలతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి...

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.