ఇంట్లో 'కోబ్రా'ల మకాం.. తవ్వినకొద్దీ బయటకు!

By

Published : Jul 22, 2021, 4:31 PM IST

thumbnail

ఇంట్లోంచి గుట్టలుగా కోబ్రా పాములు బయటపడితే.. ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్​ కట్నీ జిల్లాలో జరిగింది. కరౌందీ ఖుర్ద్​ గ్రామానికి చెందిన సరోజ్​ సింహ గౌడ్​ అనే వ్యక్తి తన ఇంట్లో పాము ఉన్నట్లు అనుమానించి పునాదుల్లో తవ్వకాలు చేపట్టాడు. ముందు ఒకటి బయటపడింది. ఆ తర్వాత మరింత లోతుగా తవ్వగా.. ఒక్కొక్కటిగా బయటకు రావటం మొదలుపెట్టాయి. మొత్తం 18 కోబ్రా పిల్లలు వచ్చినట్లు సరోజ్​ తెలిపారు. పాములు పట్టేవారికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. కోబ్రా పిల్లల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.