ప్రజలపైకి దూసుకెళ్లిన మరో కారు- దుర్గాదేవి నిమజ్జనం వేళ..

By

Published : Oct 17, 2021, 2:03 PM IST

thumbnail

మధ్యప్రదేశ్‌ భోపాల్​లో దుర్గాదేవీ నిమజ్జనం ఊరేగింపులో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెనక్కి వచ్చిన కారు అక్కడ ఉన్న భక్తులను ఢీ కొట్టింది. బజారియా పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఓ హెడ్ కానిస్టేబుల్​ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత డ్రైవర్ కారును ఆపకుండా వెళ్లినట్లు తెలుస్తోంది. నిందితుని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.