పెళ్లి భోజనంలో పనీర్ పెట్టలేదని గొడవ.. బెల్టులతో కొట్టుకున్న వధూవరుల బంధువులు

By

Published : Feb 9, 2023, 7:36 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

thumbnail

వివాహ విందులో పనీర్ పెట్టలేదని పెళ్లి కుమారుడి బంధువు హల్​చల్ చేశాడు. దీంతో పెళ్లి వేడుకలో తీవ్ర దుమారం చెలరేగింది. వధువు, వరుడి కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు బెల్టులతో దాడులు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గొడవకు దిగిన కొందరిని అరెస్ట్ చేశారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదరడం వల్ల అందరినీ విడిచిపెట్టారు. ఉత్తర్​ప్రదేశ్​లోని బాగ్​పత్​లో జరిగిందీ ఘటన. ఈ దాడి దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. 

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.