పైనుంచి రైలు.. ట్రాక్​ మధ్యలో నక్కి బాలికను కాపాడిన యువకుడు

By

Published : Feb 12, 2022, 1:43 PM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

thumbnail

రాజస్థాన్​లోని భూపాల్​లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోబోతున్న బాలిక ప్రాణాలను కాపాడాడు. 17 ఏళ్ల అమ్మాయి చనిపోవాలని భోపాల్​లోని బర్ఖేడీ గేట్​ సమీపంలో ఉన్న ట్రాక్ వద్దకు వెళ్లింది. గూడ్సు రైలు వస్తున్నప్పుడు పట్టల మీద పడింది. దీనిని గమనించిన మెహబూబ్ అనే యువకుడు ఆమెను ట్రాక్​ పై నుంచి జరిపి మధ్యలోకి తీసుకువచ్చాడు. దీంతో ఆ గూడ్స్​ రైలు వారి పైన నుంచి పోయింది. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి బాలికను కాపాడిన యువకుడిని నెటిజన్లు అభినందిస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.