రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి పెరగడం వల్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సూచనలతో పలు ప్రముఖ ఆలయాల్లో పూజ సేవలను రద్దు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనాలను ఇవాళ్టి నుంచి నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులను ఆలయంలోకి అనుమతించమని అధికారులు తెలిపారు. నేటి నుంచి స్వామి వారికి ఏకాంత సేవలో నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని ప్రకటించారు. భక్తులు లేక ఆలయ పరిసరాలన్ని నిర్మానుష్యంగా మారాయి. కొండపైన ఉన్న భక్తులను క్రిందికి వెళ్లాలని సూచిస్తున్నారు. పైకి వెళ్లకుండా కొండ కిందద ఘాటురోడ్డు వద్ద నిలిపేస్తున్నారు.