యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో.. ఊంజల్ సేవా మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. బాలాలయంలో కొలువుదీరిన ఆండాళ్ అమ్మవారిని.. పువ్వులు, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![Andal Amma Unjal Seva](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-83-09-yadadri-unjal-seva-av-ts10134_09042021191338_0904f_1617975818_806.jpg)
మహిళలు.. మంగళ హారతులతో అమ్మవారిని స్తుతిస్తూ... పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖమండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల లాలిపాటలతో అమ్మవారిని కొనియాడారు. ఈ ఉత్సవంలో.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అర మీటరు బెండకాయ అదిరింది గురూ!