ETV Bharat / state

'వరద బాధితులకు సాయం పంపిణీ చేయకపోతే కాలనీల్లో తిరగనివ్వం'

author img

By

Published : Nov 9, 2020, 6:48 PM IST

'వరద బాధితులకు సాయం పంపిణీ చేయకపోతే కాలనీల్లో తిరగనివ్వం'
'వరద బాధితులకు సాయం పంపిణీ చేయకపోతే కాలనీల్లో తిరగనివ్వం'

భాజపా ఎదుగుదలను చూసి ఓర్వలేకే మంత్రి కేటీఆర్... విమర్శలు చేస్తున్నారని భాజాపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్​ రెడ్డి వరంగల్​లో అన్నారు. రాష్టానికి కేంద్రం నిధులు ఇస్తున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్​లో వరద బాధితులకు ఇంటికి రూ.10 వేలు అందిస్తున్నారు కానీ.. వరంగల్​లో ఎందుకు ఇవ్వలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్​ రెడ్డి అన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అసత్యాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

గ్రేటర్ ఎన్నికలు ఉండటం వల్లనే ప్రజలకు ఆర్థిక సాయం పంపిణీ చేశారని విమర్శించారు. వరంగల్​లో వరద బాధితులను ఆదుకున్నామని చెప్పిన కేటీఆర్... ఎక్కడ ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. వరంగల్​లో వరద బాధితులకు తక్షణమే రూ.20 వేలు చొప్పున పంపిణీ చేయాలన్నారు. లేని పక్షంలో తెరాస నాయకులను కాలనీల్లో తిరగనివ్వమని హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'మీరు రాజీనామా చేస్తామంటే కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.