ETV Bharat / state

భాజపా నిరసన... కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్​లో తోపులాట

author img

By

Published : Jan 16, 2021, 7:02 PM IST

టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలోని ప్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడం పట్ల భాజపా కార్యకర్తలు వరంగల్​ అర్బన్​ జిల్లాలో ఆందోళన చేపట్టారు. కేవలం సీఎం కేసీఆర్​ ఫొటో మాత్రమే ముద్రించడం వెనుక ఆంతర్యమేంటని అధికారులను ప్రశ్నించారు.

Breaking News

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో ఏర్పాటు చేసిన కొవిడ్​ టీకా పంపణీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ పార్టీ మండలాధ్యక్షుడు పృథ్వీరాజ్​​ వైద్యాధికారులను ప్రశ్నించారు.

టీకా కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీపై ప్రధాని మోదీ ఫొటో లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో మాత్రం ముద్రించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన భాజపా నేతలు ఆసుపత్రి వైద్యాధికారి గది ముందు ధర్నా నిర్వహించారు. ఆందోళన విరమించాల్సిందిగా అధికారులు కోరినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో పోలీసులు నిరసన చేస్తోన్నవారిని బలవంతంగా బయటకు తోసేశారు. ఈ ఘర్షణలో పోలీసులకు, భాజపా నేతలకు మధ్య తోపులాట జరిగింది.

ఇదీ చదవండి: చిన్నారి తీసిన ఫోటోకు కలెక్టర్ ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.