పరకాలలోని రాజీపేటలో ఆరో వార్డు విసిట్ కార్యక్రమం జరిగింది. ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరితో పాటుగా ఛైర్పర్సన్ సోదా అనిత పాల్గొన్నారు. వార్డులో తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్డులో రోడ్డు నిర్మాణానికి అవసరమైన మొరం పనులు, చేతి పంపుల ప్లాట్ఫాం నిర్మాణాలతో పాటుగా.. కాలువలు శుభ్రం చేయిస్తానని హమీ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి నగరాభివృద్ధికి తోడ్పడుతున్న ఈటీవీ భారత్ బృందాన్ని అభినందించారు.
ఇదీ చదవండి: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్కు సుప్రీంకోర్టు అనుమతి