ETV Bharat / state

ఈటీవీ భారత్​ 'వార్డు సందర్శన'లో పాల్గొన్న ఛైర్మన్ అనిత

author img

By

Published : Jan 5, 2021, 5:19 PM IST

ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో వార్డు సందర్శన కార్యక్రమం జరిగింది. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో జరిగిన ఈ సమావేశంలో పట్టణ మున్సిపల్ ఛైర్​పర్సన్​తో పాటు.. కమిషనర్ పాల్గొన్నారు.

Ward visit program was conducted under the auspices of ETV bharath in rural warangal
'సమస్యల పరిష్కారానికి హామీ'

పరకాలలోని రాజీపేటలో ఆరో వార్డు విసిట్ కార్యక్రమం జరిగింది. ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరితో పాటుగా ఛైర్​పర్సన్​ సోదా అనిత పాల్గొన్నారు. వార్డులో తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వార్డులో రోడ్డు నిర్మాణానికి అవసరమైన మొరం పనులు, చేతి పంపుల ప్లాట్​ఫాం నిర్మాణాలతో పాటుగా.. కాలువలు శుభ్రం చేయిస్తానని హమీ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి నగరాభివృద్ధికి తోడ్పడుతున్న ఈటీవీ భారత్ బృందాన్ని అభినందించారు.

ఇదీ చదవండి: సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​కు సుప్రీంకోర్టు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.